అడవుల్లో రోడ్లేసి.. గ్రామాల్లో వేయరా?

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి నిరసన సెగ తగిలింది. మంగళవారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడు

Published : 06 Jul 2022 05:44 IST

గడపగడపలో ఉప ముఖ్యమంత్రికి నిరసన సెగ

వెదురుకుప్పం, న్యూస్‌టుడే: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి నిరసన సెగ తగిలింది. మంగళవారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ దిగువ గెరిగదొన ఎస్సీ కాలనీలో ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాలను వాకబు చేశారు. పురుషోత్తపురం, దిగువ గెరిగదొనలకు వెళ్లే దారిని బాగు చేయలేదని, కంకర తేలిన దారిపై నడుస్తూ ఇబ్బందులు పడుతుంటే మీరు అడవుల్లో రోడ్లేసి.. గ్రామాల్లో వేయరా అంటూ కాలనీకి చెందిన గోపి వ్యక్తి ఆయన్ను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన ఉప ముఖ్యమంత్రి ‘నువ్వు తెదేపాకు చెందిన వాడివి, చెప్పుడు మాటలు విని ప్రశ్నించడం తగదు’ అన్నారు. తాను వైకాపాకు చెందిన వ్యక్తినేనని గోపి చెప్పగా.. దారి సమస్య తెదేపా హయాంలోనిదే అంటూ చంద్రబాబుపై నారాయణస్వామి మరిన్ని విమర్శలు చేశారు. అనంతరం ఆర్కేఎం పురం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని