దసపల్లా భూములకు రాజకీయ రంగు తగదు

దసపల్లా భూములకు రాజకీయ రంగు వేయవద్దని ఆ కుటుంబసభ్యులు రాణి కమలాదేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్‌ చంద్రదేవ్‌ భంజ్‌ ఓ ప్రకటనలో కోరారు.

Published : 03 Oct 2022 02:23 IST

ఇష్టపూర్వకంగానే అష్యూర్‌ సంస్థతో ఒప్పందం

ఆ కుటుంబసభ్యులు రాణి కమలాదేవి, దిగ్విజయ్‌ చంద్రదేవ్‌ భంజ్‌ వెల్లడి

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: దసపల్లా భూములకు రాజకీయ రంగు వేయవద్దని ఆ కుటుంబసభ్యులు రాణి కమలాదేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్‌ చంద్రదేవ్‌ భంజ్‌ ఓ ప్రకటనలో కోరారు. ఇష్టపూర్వకంగానే తమ కుటుంబసభ్యులు, ఇతర కొనుగోలుదారులు ఆయా భూములను అభివృద్ధి చేసుకోవడానికి అష్యూర్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థతో సంయుక్తంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి, బలవంతం లేదని, ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో తమకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ భూములకు సంబంధించి రాజకీయ నాయకులెవర్నీ సంప్రదించలేదన్నారు. న్యాయస్థానాలు తమ భూములను ప్రైవేటువిగా ప్రకటించాయని చెప్పారు. ఈ సందర్భంగా దసపల్లా భూములకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. దసపల్లా కుటుంబ సభ్యులు, కొనుగోలుదారులు నిషేధిత జాబితా 22ఏ నుంచి భూములను డీనోటిఫై చేయాలని ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నారని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని