నేడు తిరుపతికి మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 04 Oct 2022 05:17 IST

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతికి రానున్నట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి 7.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, నేరుగా తిరుమల వెళ్లి బస చేయనున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని, మధ్యాహ్నం 12 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని