విదేశీ విద్య.. ‘మధ్య తరగతి’ ఎజెండా..
భారతీయులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం శతాబ్దాల నుంచి ఉన్నదే. అయితే ధనవంతుల బిడ్డలకు మాత్రమే ఫారిన్ చదువనే పరిస్థితి మాత్రం మారింది. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు సైతం ప్రతిభ ఉన్న తమ పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు ప్రోత్సహిస్తున్నాయి.
అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు రికార్డుస్థాయిలో భారతీయ విద్యార్థులు
ఈ ఏడాది పెద్దఎత్తున వీసాల జారీ
తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 20-25%
ఈనాడు, హైదరాబాద్: భారతీయులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం శతాబ్దాల నుంచి ఉన్నదే. అయితే ధనవంతుల బిడ్డలకు మాత్రమే ఫారిన్ చదువనే పరిస్థితి మాత్రం మారింది. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు సైతం ప్రతిభ ఉన్న తమ పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం తమకున్న కొద్దిపాటి ఆస్తుల్ని విక్రయించడానికి వెనుకాడడంలేదు. బ్యాంకులు సైతం ఇబ్బందులు పెట్టకుండా విద్యా రుణాలు ఇస్తుండడం కలిసివస్తోంది. విదేశాల్లో ఎంఎస్ పూర్తిచేస్తే.. ఐటీ రంగంలో మంచి కొలువులు దక్కుతాయని, రెండు మూడేళ్లలోనే ఆ అప్పులన్నీ తీర్చవచ్చనే నమ్మకం.. వారిని ఆ దిశగా అడుగులు వేయిస్తోంది. భారతీయ మధ్య తరగతి కుటుంబాల్లో 57 శాతం మంది తమ పిల్లల్ని విదేశాల్లో చదివించాలనుకుంటున్నారని లీప్, ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.
చైనాని అధిగమించి..
భారతీయ విద్యార్థులు అమెరికాతో పాటు కెనడా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకూ క్యూ కడుతున్నారు. ఈ ఏడాది తొలిసారి చైనా కంటే భారతీయ విద్యార్థులకే యూకే అధికంగా స్టడీ వీసాలు జారీ చేసింది. ఇప్పటివరకు అమెరికాలో చైనా విద్యార్థులదే ప్రథమ స్థానం కాగా.. ఆ స్థానాన్ని భారత్ అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వాటా 20-25 శాతం ఉంటుందని అంచనా. ప్రస్తుతం 12 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతుండగా.. ఆ సంఖ్య 2025 నాటికి 20 లక్షలకు చేరుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అమ్మాయిలు సైతం అత్యంత ఆసక్తి చూపుతున్నారు
- వేముగంటి అజయకుమార్, డైరెక్టర్, ఐఎంఎఫ్ఎస్ కన్సల్టెన్సీ
విదేశాల్లో చదువుకుంటే ఐటీ రంగంలో మంచి వేతనంతో అక్కడే స్థిరపడవచ్చని తల్లిదండ్రులు, విద్యార్థులు భావిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో కూడా విదేశీ విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అమ్మాయిలు సైతం విదేశీ చదువుకు అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఏడేళ్లు తమ దేశంలో ఉంటే గ్రీన్కార్డు ఇస్తామని అమెరికా ఇటీవలే ప్రకటించింది. అది అమల్లోకి వస్తే మరింత మంది ఆ దేశానికి తరలివెళ్లే అవకాశం ఉంది.
వివిధ దేశాల్లో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు ఇలా..
* అమెరికా ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు రికార్డుస్థాయిలో 82 వేల విద్యార్థి (ఎఫ్-1) వీసాలు జారీచేసింది. అందులో అధిక శాతం మే నుంచి ఆగస్టు మధ్య మంజూరు చేసింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారత్ది రెండో స్థానం.
* ఈ ఏడాది తొలి 6 నెలల్లో 60,258 మంది భారతీయ విద్యార్థులు కెనడా వెళ్లారు. 2019లో 1,32,620 మంది ఆ దేశానికి వెళ్లగా.. 2020లో కరోనాతో ఆ సంఖ్య 43,624కు పడిపోయింది. తిరిగి 2021లో 1,02,688కి పెరిగింది. ఈసారి 2019 కంటే కెనడా వెళ్లే విద్యార్థులు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. ఈ దేశానికి వెళుతున్న విద్యార్థుల శాతం 2016-21 మధ్య 220 శాతం పెరగడం గమనార్హం.
* యూకే ఈసారి రికార్డుస్థాయిలో 2021 జులై నుంచి 2022 జూన్ వరకూ 1,17,965 స్టడీ వీసాలు జారీచేసింది. ఇప్పటివరకు ఈ వీసాలు పొందడంలో చైనా అగ్రగామిగా ఉండగా.. ఈసారి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే భారతీయులకు విద్యార్థి వీసాలు 89 శాతం పెరిగాయి.
* ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ విద్యార్థులు 2.60 లక్షల మంది చదువుతుండగా.. వారిలో భారత్ విద్యార్థులు దాదాపు సగం మంది ఉన్నారు.
* మన దేశ విద్యార్థుల సంఖ్యను 2025 నాటికి 20 వేలకు పెంచుకోవాలని ఇటీవలే ఫ్రాన్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంంది. జర్మనీ, ఫిన్లాండ్, ఐర్లాండ్ తదితర దేశాలు సైతం భారతీయ విద్యార్థులను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు