Andhra News: ‘ఫ్యామిలీ ఫిజిషియన్’లకు రూ.4,500 పారితోషికం!
రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ కింద సేవలందించే వైద్యులకు పారితోషికం కింద నెలకు రూ.4,500 వరకు చెల్లించనున్నారు. పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులు నెలలో కనీసం 13 రోజుల నుంచి 15 రోజుల వరకు ఈ పథకం కింద గ్రామాలకు వెళ్తున్నారు.
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ కింద సేవలందించే వైద్యులకు పారితోషికం కింద నెలకు రూ.4,500 వరకు చెల్లించనున్నారు. పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులు నెలలో కనీసం 13 రోజుల నుంచి 15 రోజుల వరకు ఈ పథకం కింద గ్రామాలకు వెళ్తున్నారు. పారితోషికం చెల్లింపుపై త్వరలో ఉత్తర్వులు వస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. పీహెచ్సీల్లోని వైద్యులు సెలవుల్లో ఉన్నప్పుడు.. సీహెచ్సీల్లో పని చేసే వారిని గ్రామాలకు పంపుతున్నారు. వీరికి రోజుకు రూ.400 వరకు పారితోషికం ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామీణ సర్వీస్ కింద వీరు పని చేసినట్లు గుర్తించే అవకాశం ఉంది. ఈ పథకం ప్రారంభమై నెల రోజులైన సందర్భంగా బాగా పని చేసిన వైద్యుల్లో తొలి ఐదుగురిని జిల్లా అధికారులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!