ఒకే సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ కోర్సులు!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ను మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
ప్రస్తుత మూడు సబ్జెక్టుల విధానానికి బదులుగా ప్రతిపాదన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టేందుకు కసరత్తు
విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు
ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ను మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం డిగ్రీలో మూడు సబ్జెక్టుల విధానం ఉండగా.. ఒకే సబ్జెక్టు విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులు చేయనుంది. ప్రస్తుతం బీఎస్సీలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు చదువుతున్న విద్యార్థి కొత్త విధానంలో ఈ మూడింటిలో ఏదో ఒక సబ్జెక్టు ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. అదే ప్రధాన సబ్జెక్టుగా ఉంటుంది. మైనర్ సబ్జెక్టులుగా ఆయనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. బీఎస్సీ చదువుతూనే ఆర్థిక శాస్త్రం, మ్యూజిక్, యోగా... ఇలా తనకు నచ్చిన వాటిని చదువుకోవచ్చు. వీటికి అదనంగా క్రెడిట్లు ఇస్తారు. విద్యార్థి బహుళ సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. 60శాతం ఆఫ్లైన్లో... 40శాతం ఆన్లైన్లోనూ చదువుకునేలా కోర్సులను డిజైన్ చేస్తున్నారు. ఆన్లైన్లోనూ మైనర్ డిగ్రీలు పూర్తి చేసే అవకాశం విద్యార్థికి ఉంటుంది. ప్రస్తుతం మూడు సబ్జెక్టులకు కలిపి 75 క్రెడిట్లు ఇస్తున్నారు. కొత్త దాంట్లో ఒక సబ్జెక్టుకు 25 క్రెడిట్లు ఇస్తారు. ఐచ్ఛికంగా విద్యార్థి ఎంపిక చేసుకునే రెండు సబ్జెక్టులకు 50 క్రెడిట్లు ఉంటాయి. క్రెడిట్ల విధానంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.
ఎప్పుడైనా చదువుకునేలా..
ప్రస్తుతం అమలు చేస్తున్న నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థి ఎప్పుడైనా బయటకు వెళ్లిపోయే అవకాశం కల్పిస్తారు. మొదటి ఏడాది చదువు మానేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. రెండేళ్లు చదివితే డిప్లొమా, మూడేళ్లు చదివితే డిగ్రీ, నాలుగేళ్లు చదివితే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. మొదటి లేదా రెండో ఏడాదిలో చదువు ఆపేసిన విద్యార్థి ఎప్పుడైనా మళ్లీ చదువుకోవాలనుకుంటే డిగ్రీలో చేరి చదువుకోవచ్చు. ఇప్పటికే ఇంజినీరింగ్లో ఈ విధానం ఉంది. ఇప్పుడు డిగ్రీలోనూ దీన్ని తీసుకురాబోతున్నారు. విద్యార్థి మధ్యలో వెళ్లిపోయి మళ్లీ చదువుకోవాలనుకొని వస్తే ఎక్కడ చేర్చుకోవాలి? మధ్యలో వెళ్లి తిరిగి వచ్చేందుకు నిర్ణీత గడువు ఎంత పెట్టాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. కోర్సుకు కావాల్సిన క్రెడిట్లు సాధిస్తే డిగ్రీ ప్రదానం చేస్తారు. ప్రధాన డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీలు చదువుకునే వెసులుబాటు ఉంటుంది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఒకేసారి డ్యుయల్ డిగ్రీలు చదివే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది. ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఒక డిగ్రీని మాత్రమే చదివే అవకాశం ఉండగా.. విద్యార్థులు ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తి చేసే విధానం ప్రవేశ పెట్టాలని సూచించింది. దీనిపైనా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ విధానాన్ని ఎలా ప్రవేశ పెట్టాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. సిలబస్ రూపకల్పనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగేళ్ల డిగ్రీలో మొదటి మూడు సెమిస్టర్లలో జీవన నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు ఉన్నాయి. మొదటి, రెండు ఏడాదిల్లో రెండేసి నెలల చొప్పున, మూడో ఏడాదిలో ఆరు నెలల ఇంటర్న్షిప్ను అమలు చేస్తున్నారు. నాలుగో ఏడాది రీసెర్చ్తో పాటు విద్యార్థి చదివిన సబ్జెక్టులకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు. పీజీ మొదటి ఏడాదిలో చదివే వాటిని నాలుగో ఏడాదికి తీసుకొస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి