ఏడాదిలో 322 రోజులు అప్పుల్లోనే..
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు(ఆర్బీఐ)లో కనీస నగదు నిల్వ నిర్వహించడానికి ఇబ్బందులు పడుతోంది. కనీస నగదు నిల్వలు లేకపోతే చెల్లింపులకు ఏదో రూపంలో అప్పులు చేయాల్సిందే.
బడ్జెటేతర రుణాలూ వెల్లడించాల్సిందే
కాగ్ స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు(ఆర్బీఐ)లో కనీస నగదు నిల్వ నిర్వహించడానికి ఇబ్బందులు పడుతోంది. కనీస నగదు నిల్వలు లేకపోతే చెల్లింపులకు ఏదో రూపంలో అప్పులు చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద కనీసం రోజూవారీ కనీస నిల్వ రూ.1.94 కోట్లు ఉండేలా చూసుకోవాలి. అంగీకరించిన నగదు నిల్వ కన్నా ఏనాడైనా తగ్గితే ఆ మొత్తాన్ని వేస్ అండ్ మీన్స్ (చేబదుళ్లు) అడ్వాన్సులు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, ఓవర్ డ్రాఫ్టు రూపంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు కూడా పరిమితులు ఉంటాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 322 రోజుల పాటు ఇలా వేరే మార్గాల్లో కనీస నిల్వను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఇలా వివిధ రూపాల్లో రిజర్వుబ్యాంకు కల్పించే ఆర్థిక వెసులుబాట్లను వినియోగించుకోవడమూ ఒక రకంగా రుణం తీసుకోవడమే. ఆ మొత్తం తిరిగి చెల్లించే క్రమంలో దానిపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఏకంగా 322 రోజుల పాటు అప్పుల్లోనే ఉన్నట్లు కాగ్ తేల్చింది. ఇలా అన్ని రోజుల పాటు రూ.1,06,325.66 కోట్లు అప్పు రూపంలో వినియోగించుకోవాల్సి వచ్చింది. ఆ మొత్తాలను రూ.111.72 కోట్ల వడ్డీతో కలిపి చెల్లించినట్లు కాగ్ పేర్కొంది. ‘రాష్ట్ర ప్రభుత్వం తరచుగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, ఓవర్ డ్రాఫ్టులను వినియోగించే అగత్యాన్ని తగ్గించడంతో పాటు తమ నగదు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి’ అని కాగ్ సూచించింది.
* వివిధ సామాజిక ఆర్థికాభివృద్ధి పథకాలకు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణాల మీద ఆధారపడకుండా రెవెన్యూ వనరులను సమకూర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాలని కాగ్ సిఫార్సు చేసింది. ఆస్తుల కల్పనకు, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే నీటిపారుదల పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా సిఫార్సు చేసింది.
* ఎఫ్ఆర్బీఎం నిబంధనల పాటింపునకు, నిధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ధ్రువీకరించేందుకు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థల ద్వారా తీసుకున్న బడ్జెటేతర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో వెల్లడించాల్సిన అవసరం ఉందని కాగ్ కుండబద్దలు కొట్టింది.
తలసరి అప్పు రూ. 92,779
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అప్పుల లెక్కల ప్రకారం 2022 మార్చి నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.92,797 రుణభారం ఉందని కాగ్ తేల్చి చెప్పింది. 2021-22 చివరి నాటికి మొత్తం అప్పులు అధికారిక లెక్కల ప్రకారం రూ.3,72,503 కోట్లుగా పేర్కొంది. వీటికి బడ్జెటేతర అధికారిక రుణాలు రూ.1,18,393 కోట్లను జత చేసింది. బడ్జెటేతర రుణాలు కలపి పరిగణించకపోతే తలసరి అప్పు రూ.70,416గాను, వాటిని కూడా కలిపితే రూ.92,797గాను ఉంటుందని లెక్కించింది. వివిధ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుంటున్నా చట్ట ప్రకారం వాటిని ఆడిట్ చేసి ఆ నివేదికలను సమర్పించడం లేదని కాగ్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు