నేడు గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ కానున్నారు.

Updated : 27 Mar 2023 04:50 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ కానున్నారు. అంతకుముందు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10:55 గంటలకు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. కొండెపి నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ భౌతికకాయానికి నివాళి అర్పిస్తారు. సాయంత్రం గవర్నర్‌ను కలుస్తారు.

* మంగళవారం సీఎం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5:15 గంటలకు విశాఖ చేరుకుంటారు. 7-8 గంటల మధ్య రిషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌లో జీ-20 ప్రతినిధులను కలుస్తారు. అనంతరం వారితో భోజనం చేసి, రాత్రి 8:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి, తాడేపల్లికి చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని