ఆర్థిక నావను కేంద్రం గట్టెక్కించేనా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఇబ్బందులను అధిగమించడంతో పాటు, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం వైపు రాష్ట్రం ఎదురుచూస్తోంది.
ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ప్రయత్నాలు
ఈనాడు, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఇబ్బందులను అధిగమించడంతో పాటు, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం వైపు రాష్ట్రం ఎదురుచూస్తోంది. వివిధ మార్గాల్లో నిధులు రాబట్టుకునేందుకు పెద్దలు దిల్లీలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవైపు బిల్లుల చెల్లింపుల కోసం ఒత్తిళ్లు, మరోవైపు ఎలాంటి రుణాత్మక నిల్వ లేకుండా ఈ ఆర్థిక సంవత్సరం ముగించి సున్నా నిల్వతో... లేదా కొద్దిపాటి నిల్వలతో కొత్త సంవత్సరంలోకి వెళ్లాలి. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు వినియోగించుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.2,700 కోట్ల వరకు రిజర్వుబ్యాంకుకు ఆ చెల్లింపులు పూర్తిచేస్తే తప్ప కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యంకాదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక గురు, శుక్రవారాలే మిగిలాయి. కేంద్రం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రూ.6,000 కోట్ల వరకు రావాలి. రాష్ట్రప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకపోవడం వల్లే ఆ నిధులను కేంద్రం ఆపిందని సమాచారం. ప్రస్తుతం ఆ నిధులు ఇస్తే తమ మ్యాచింగు గ్రాంటు మొత్తం ఏప్రిల్, లేదా మే నెలల్లో జతచేస్తామని రాష్ట్రప్రభుత్వం పేర్కొంటోంది. ఆ నిధులు తెచ్చుకునే ఆస్కారం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఇప్పటికే బ్యాంకులను కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి నిధులిచ్చేందుకు రెండు బ్యాంకులు ఆసక్తి చూపుతున్నా కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరికలతో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. రెండు బ్యాంకుల నుంచి చెరో రూ.2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఆ బ్యాంకులకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా కోరుతున్నట్లు తెలిసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలోనే కొంత రుణం రిజర్వుబ్యాంకు నుంచి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కూడా ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. నికర రుణపరిమితి తేల్చేలోపు అడ్హాక్గా రిజర్వుబ్యాంకు సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణం తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం.
ప్రత్యేక సాయం కింద రూ.1,500 కోట్లు
కేంద్రప్రభుత్వం ప్రత్యేక సాయం కింద రూ.1,500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల కింద 90% పనులు పూర్తయి, మరో 10% పనులు పూర్తిచేస్తే ఫలితాలు వచ్చే పనులకు బిల్లులను ఈ నిధులతో చెల్లిస్తారని సమాచారం. ఇందుకోసం వివిధ ప్రభుత్వశాఖల నుంచి ఆయా కేటగిరీలో వచ్చే బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ప్రత్యేక ఆర్థికసాయం కింద మరికొంత నిధులు కేంద్రం నుంచి వచ్చే ఆస్కారం ఉందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!