సామాజిక మాధ్యమాల్లో రాజకీయ విమర్శలూ నేరమేనా?
‘నాయకుడు కార్యకర్తకు అండగా ఉండాలి. జీవనోపాధి మీద కొట్టకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా నాయకుడు మేలు చేయకపోగా.. ఉన్న ఉద్యోగంలో నుంచి తీసేయించి ద్రోహం చేశాడు’ అని అధికార పార్టీ అభిమాని ఒకరు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అది మహా నేరమట.
ప్రతిపక్షాల భావప్రకటన స్వేచ్ఛపై నిషేధమా?
వారిని అరెస్టు చేసి, వేధిస్తారా?
రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
ఈనాడు - అమరావతి
* ‘నాయకుడు కార్యకర్తకు అండగా ఉండాలి. జీవనోపాధి మీద కొట్టకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా నాయకుడు మేలు చేయకపోగా.. ఉన్న ఉద్యోగంలో నుంచి తీసేయించి ద్రోహం చేశాడు’ అని అధికార పార్టీ అభిమాని ఒకరు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అది మహా నేరమట.
* ‘చంద్రగిరి నియోజకవర్గంలో నీకే దిక్కు లేదు. నీ బిడ్డకు ఎక్కడిది రా తమ్ముడూ’ అంటూ ప్రతిపక్ష కార్యకర్త ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. అదీ శిక్షార్హమట.
* ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే.. ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించే సమాచారాన్ని కూడా పోలీసులు బయటపెట్టొచ్చట..
రాష్ట్ర పోలీసులు చెబుతున్న సరికొత్త భాష్యాలివి. ప్రభుత్వాన్ని, వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, అభిప్రాయాలు వ్యక్తం చేసినా వారి పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకు ఈ ఉదంతాలు తాజా తార్కాణాలు మాత్రమే. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ వారిపైన చిన్న రాజకీయ విమర్శ చేసినా సహించేది లేదన్నట్లుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. విచారణ పేరిట ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకుల్ని వేధిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల భావప్రకటన స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రంపై ప్రభుత్వం, పోలీసులు ఏమైనా నిషేధం విధించారా? సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారే లక్ష్యంగా కొన్నాళ్ల కిందట వరకూ సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసేవారు. అరెస్టు చేసి, విచారణ పేరిట వేధించేవారు.
ఇప్పుడు ఈ బాధ్యతలను స్థానిక పోలీసులు నెత్తికెత్తుకున్నారు. కేసులు పెట్టి, అదుపులోకి తీసుకుని విచారణ పేరిట హింసిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులపై అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిపై మాత్రం చర్యలే తీసుకోవట్లేదు. అసలు వారి నుంచి ఫిర్యాదులే స్వీకరించడం లేదు. అధికార పార్టీ వారు చేసినా, ప్రతిపక్షాల నాయకులు చేసినా అది తప్పే. ఎవరిపైనైనా సమానంగా చర్యలు ఉండాలి. కానీ రాష్ట్ర పోలీసులు మాత్రం ‘అధికార వైకాపా నాయకులు ఎంతటి నేరానికి తెగబడినా తప్పు కాదు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు వారి భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవటమూ నేరమే’ అన్నట్లుగా ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు.
ఇది హక్కులను కాలరాయటం కాదా?
* తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐటీడీపీ అధ్యక్షుడు రాకేశ్ చౌదరిని పోలీసులు ఇటీవల ఆయన ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో సమాచారమే ఇవ్వలేదు. స్థానిక తెదేపా నాయకులు పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లి గట్టిగా ప్రశ్నిస్తే ‘వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అతని కుమారుడిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టటంతో రాకేశ్ చౌదరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం’ అని సీఐ ప్రకటించారు. రాజకీయ విమర్శలతో పోస్టులు పెడితే కౌన్సెలింగ్ పేరిట అదుపులోకి తీసుకోవటం ఏంటి? వ్యక్తులకు భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం ఉండదా? ప్రతిపక్షాలకు వాటిని ఏమైనా నిషేధించారా?
* సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే తనను ఉద్యోగం నుంచి తీసేశారన్న ఆవేదనతో శ్రీహరికోటకు చెందిన వైకాపా సానుభూతిపరుడు మంగపల్లి జ్యోతిష్కుమార్రెడ్డి అలియాస్ బాబురెడ్డి.. వైకాపా నాయకుడికి వ్యతిరేకంగా పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. పోలీసులు ఆయన్ను స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారు. అధికార పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? ఆ హక్కు పోలీసులకు ఎక్కడిది?
* ముఖ్యమంత్రి జగన్, వైకాపా ప్రభుత్వం, పార్టీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడంటూ ప్రవాసాంధ్రుడైన పొందూరు కోటిరత్న అంజన్ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే ఆ నేరంతో సంబంధం లేని అతని వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలను కూడా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఒకరి వ్యక్తిగత వివరాలను పోలీసులు బహిరంగంగా ఎలా ప్రకటిస్తారు? ఇది వ్యక్తిగత, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటం కాదా?
ప్రతిపక్ష నాయకులపై అసభ్య పోస్టులు పెడుతున్నవారిపై చర్యలేవి?
తమపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా, అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు.
* రాజమహేంద్రవరం అర్బన్ (తెదేపా) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కించపరుస్తూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లయినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఈ విషయాన్ని భవాని పలుమార్లు అసెంబ్లీలోనూ ప్రస్తావించినా చర్యలు శూన్యం.
* అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులను దూషిస్తూ వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు దాటుతున్నా కేసు లేదు.
* తెదేపా మహిళా నేతలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధలను ఉద్దేశించి వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. వాటిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు.
* తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంతకాల్ని ఫోర్జరీ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెదేపా నాయకులు సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. కనీసం కేసు నమోదు చేయలేదు.
* తెదేపా నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్పైన, ఆయన కుటుంబ సభ్యులపైన సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, చంపేస్తామని హెచ్చరించే పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదిచ్చారు. దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు.
వైకాపాకు ఎదురుతిరిగితే చట్టాలు అండగా నిలబడవా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైకాపా ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దళిత మహిళ అయిన ఎమ్మెల్యే, ఆమె కుమార్తెలపైన వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందాయి. వీటిపై పోలీసులకు ఫిర్యాదులు అందినా కేసు నమోదు చేయలేదు. ఇదంతా వైకాపాకు ఎదురుతిరిగితే చట్టాలేవీ మీకు అండగా నిలబడవని, మీపై ఎంతటి నేరం జరిగినా చూస్తూ ఉంటామని పోలీసులు చెబుతున్నట్లు కాదా?
వైకాపా శ్రేణులపై కేసులు ఎత్తేసుకోవచ్చా? మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులా?
* ‘గత ప్రభుత్వ హయాంలో వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేయాలని ఇప్పటికే పార్టీ తరఫున డీజీపీని కలిశాం. అధికారికంగా డీజీపీకి లేఖ రాస్తాం. మీపై నమోదైన కేసుల వివరాల్ని కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తే వాటిని ఎత్తేయించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది’ అని 2019 ఆగస్టు 14న జరిగిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఏడాదిన్నర తర్వాత 2020 డిసెంబరు 6న విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ‘వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై గత ప్రభుత్వంలో నమోదైన 135 కేసులకు గాను 120 ఉపసంహరించుకున్నాం. న్యాయస్థానాల్లో మరో 7 కేసుల విచారణ కొనసాగుతోంది. వాటిలో పార్టీ తరఫున న్యాయసహాయం అందిస్తున్నాం’ అని వెల్లడించారు.
* వైకాపా కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అసభ్యపదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే వారిపై నమోదైన కేసుల్ని ఎత్తేస్తారా? ప్రభుత్వ వైఫల్యాల్ని, విధానాల్లోని లోపాల్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు పోస్టులు పెడితే వారిపైన కేసులు నమోదు చేసేసి అరెస్టు చేస్తారా? మరీ ఇంత ఏకపక్ష, పక్షపాత ధోరణా? ఈ రాష్ట్రంలో వైకాపా కోసం పోలీసులు ప్రత్యేక చట్టమేమైనా అమలు చేస్తున్నారా?
45 నెలల్లో వందల మందిపై కేసులు
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష, ప్రజాసంఘాల నాయకులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, తటస్థులు, పాత్రికేయులు ఇలా ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా వారిపై కేసులు పెట్టి అణచివేస్తున్నారు.. 45 నెలల్లో వందల మందిపై ఇలా కేసులు పెట్టి వేధించారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కేసులు పెడుతున్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్లు బనాయిస్తున్నారు. గతంలో రాజద్రోహం సెక్షన్లు కింద కూడా కేసులు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు