అటకెక్కిన రైతుబంధు
రైతులు పండించే పంటలపై వసూలుచేసే మార్కెట్ రుసుమునూ.. వడ్డీలేని రుణం రూపంలో వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు.
నాలుగేళ్లుగా వడ్డీలేని రుణాలకు ప్రభుత్వం చెల్లుచీటీ
ఏడాదికి రూ.500 కోట్లకుపైగా రుసుముల వసూలు
వడ్డీలేని రుణాలకు పైసా కూడా విదల్చని వైనం
ఈనాడు, అమరావతి: రైతులు పండించే పంటలపై వసూలుచేసే మార్కెట్ రుసుమునూ.. వడ్డీలేని రుణం రూపంలో వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. మార్కెట్ కమిటీల ద్వారా అమలుచేసే రైతుబంధుకు చెల్లుచీటీ ఇచ్చేసింది. తమ పార్టీ నేతల రాజకీయ ఉపాధి కోసం మార్కెట్ కమిటీలను 191 నుంచి 218కి పెంచిన ప్రభుత్వం.. నాలుగేళ్ల నుంచి వాటిలో ఒక్క చోటా రైతుకు రుణం ఇవ్వలేదు. మూడు దశాబ్దాల నుంచి నడుస్తున్న కీలక పథకాన్ని నిలిపేసి, అన్నదాతలను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో పెట్టింది. మార్కెట్ కమిటీల్లో ఎమ్మెల్యేలను గౌరవ అధ్యక్షులుగా చేయడం, రైతులు కాకున్నా అధికారపార్టీ వాళ్లయితే పాలకవర్గంలో వేయచ్చన్నట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. కనీసం గోదాముల్లో పంట ఉత్పత్తుల నిల్వకూ అవకాశం లేకుండా చేసింది.
మూడు దశాబ్దాలకు పైగా..
ఉమ్మడి రాష్ట్రం నుంచి రైతుబంధు పథకం అమలవుతోంది. 1982 నుంచి పంట ఉత్పత్తుల తాకట్టుపై రుణం తీసుకునే పథకం ఉన్నా.. దానికి 1995లో రైతుబంధుగా పేరు మార్చారు. ఈ పథకం ద్వారా మార్కెట్ కమిటీ గోదాముల్లో రైతులు నిల్వచేసిన పంట ఉత్పత్తులపై 75% విలువ మేర గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణం ఇస్తారు. దీనిపై 180 రోజుల వరకూ వడ్డీ ఉండదు. 6 నెలల నుంచి 9 నెలల వరకు 12% చొప్పున వడ్డీ వసూలుచేస్తారు.
విత్తనం వేసే సమయంలో ధరలు అధికంగా ఉన్నా.. పంట చేతికొచ్చే సమయానికి పడిపోతుంటాయి. అప్పుడు పంటను తెగనమ్ముకోకుండా.. మార్కెట్ కమిటీ పరిధిలోని గోదాముల్లో నిల్వ చేసుకుని దానిపై రుణం తీసుకునే వెసులుబాటు ఈ పథకం ద్వారా లభిస్తుంది. ధర బాగున్నప్పుడు అమ్ముకుని రుణం తీర్చేయొచ్చు. గతంలో రైతులు తమకు దగ్గరలోని మార్కెట్ కమిటీ గోదాముల్లో వరి, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనెగింజల పంటలను నిల్వ చేసి రుణాలు తీసుకునేవారు.
2019 వరకు అమలైనా..
ప్రారంభంలో రైతులకు రుణాలు బాగానే ఇచ్చేవారు. తర్వాత మార్కెట్ కమిటీ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లిస్తూ.. కేటాయింపులు తగ్గించారు. 2017-18లో 3,238 మంది రైతులకు రూ.54.08 కోట్లు, 2018-19లో రూ.40.51 కోట్ల రుణం ఇచ్చారు. తర్వాత అసలు అమలే నిలిపేశారు.
రైతుల నుంచి వసూలు చేసే సొమ్ము ఇవ్వడానికీ ఇబ్బందా?
పంట ఉత్పత్తుల అమ్మకాలపై మార్కెట్ కమిటీలు 1% రుసుము వసూలుచేస్తాయి. ఉద్యోగుల జీతాలు, రైతుబంధుకు అవసరమయ్యే నిధుల్ని వాటినుంచే కేటాయించేవారు. 2019 నుంచి వీటిని నిలిపేశారు. సంస్కరణల పేరుతో రైతులు పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకునేందుకూ చోటివ్వడం లేదు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయమే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలను రాజకీయ పునరావాసాలుగా మార్చిన ప్రభుత్వం.. అన్నదాతలకు వాటిని దూరం చేసిందని రైతుసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
రైతులకు మార్కెట్ కమిటీ నిధుల నుంచి వడ్డీలేని రుణం ఇవ్వడానికి.. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి మనసు రావట్లేదు. పంట ఉత్పత్తులపై మార్కెట్ రుసుము రూపంలో ఏడాదికి రూ.500 కోట్లకు పైగా ఖజానాలో జమ చేసుకుంటున్నా... అందులోనుంచి అప్పుగానే ఏడాదికి రూ.100 కోట్లు ఇచ్చేందుకూ ససేమిరా అంటోంది. ఏడాదికి మూడు విడతలుగా ఇచ్చే రూ.7,500 రైతు భరోసాతో సరిపెట్టుకోవాలంటూ ‘రైతుబంధు’ పథకాన్ని అటకెక్కించింది. వ్యాపారుల వద్ద పెట్టుబడి కోసం రైతులు అధిక వడ్డీకి అప్పు తెచ్చుకుని సాగు చేస్తున్నా.. తమకేమీ పట్టనట్లే చోద్యం చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
వందనమమ్మా.. డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!