మార్గదర్శి కేసుల్ని మరో హైకోర్టుకు మార్చండి: ఏపీ పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరణ
మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఏపీ సీఐడీ వేసిన కేసులను సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను.. తెలంగాణ హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్లపై తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
తదుపరి విచారణ జులై 18కి వాయిదా
ఈనాడు, దిల్లీ: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఏపీ సీఐడీ వేసిన కేసులను సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను.. తెలంగాణ హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్లపై తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులను పూర్తిగా విన్న తర్వాతే తదుపరి నిర్ణయాన్ని వెలువరిస్తామంటూ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందల్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వుల అంశాన్ని ఆ సమయంలో పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ తొలుత వాదనలు వినిపిస్తూ ‘మార్గదర్శి సంస్థ కొన్ని చిట్ఫండ్ బ్రాంచ్లను ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఏర్పాటు చేసింది. ఈ బ్రాంచ్లు అక్కడ వసూలైన మొత్తాన్ని ప్రధాన కార్యాలయానికి తరలించి, అక్కడి నుంచి మళ్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తులో తేలింది’ అన్నారు.
మార్గదర్శి సంస్థ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్ ఎలా దాఖలు చేశారో తెలియడం లేదు, ఒకసారి ఆర్టికల్ 139(ఎ) చూడండి అని ధర్మాసనాన్ని కోరారు. ఇది క్రిమినల్ కేసా అని జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రశ్నించారు. ఆర్టికల్ 226 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ అని హరీష్ సాల్వే చెప్పగా.. రిట్ పిటిషన్లకు సీఆర్పీసీ సెక్షన్ 406 వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇవి ఆర్టికల్ 139 పిటిషన్లని సాల్వే చెప్పారు. జస్టిస్ బోస్ బదులిస్తూ సుప్రీంకోర్టులో కూడా అలాంటి కేసులే పెండింగ్లో ఉంటే ఆర్టికల్ 139 వర్తిస్తుందన్నారు. హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. అన్నింటికంటే దారుణమేంటంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టు పరిధిని సవాల్ చేస్తూ అక్కడ పిటిషన్ దాఖలు చేసినా, హైకోర్టు తనకు ఆ పరిధి ఉన్నట్లు స్పష్టం చేసిందన్నారు. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి బదులు ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్ 406 ప్రకారం దాఖలు చేసిన అప్లికేషన్ కేవలం క్రిమినల్ కేసులకే వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు. అందుకు ఆయన బదులిస్తూ దాన్ని ఆర్టికల్ 139తో కలిపి చూడాలన్నారు. ఇక్కడ ఆర్టికల్ 139 వర్తించదని హరీష్ సాల్వే బదులిచ్చారు.
రాజ్యాంగంలోని 139(ఎ)(2) ప్రకారం వేగంగా న్యాయం చేయడానికి ఏ హైకోర్టు ముందున్న కేసునైనా మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అది రెండు, అంతకు మించి హైకోర్టుల ముందు కేసులు పెండింగ్లో ఉన్నప్పుడే వర్తిస్తుందని జస్టిస్ బోస్ తేల్చిచెప్పారు. ఇలాంటి కేసు ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉందని, అక్కడ వాళ్లు మధ్యంతర ఉత్తర్వులు పొందారని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. ఈ అంశంపై ఈ నెల 26న తుది విచారణ చేపడతామని హైకోర్టు చెప్పినా దానిపై వారు అక్కడ కనీసం సమాధానం కూడా దాఖలు చేయలేదని, అందువల్ల ఆర్టికల్ 139 విషయంలో ఇలాంటి రాజకీయాలకు అనుమతివ్వకూడదని సాల్వే కోరారు. తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయడం లేదని, కేసును వింటామని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు.
తెలంగాణ హైకోర్టు పరిధిపై సవాల్ చేయలేదు
మార్గదర్శి తరఫున మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ జోక్యం చేసుకుంటూ మార్గదర్శి సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉన్నట్లు, అక్కడ సోదాలు నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లోనే పేర్కొందని తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన జ్యూరిస్ డిక్షన్ తమకు ఉందని తెలంగాణ హైకోర్టు సవివరమైన తీర్పు కూడా ఇచ్చిందన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాలు కూడా చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఏపీలో దాఖలైన ఛార్జిషీట్లపై తెలంగాణ హైకోర్టు విచారిస్తోందన్నారు.
హరీష్ సాల్వే జోక్యం చేసుకుంటూ.. ఇలా వాదించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతివ్వకూడదని విజ్ఞప్తి చేశారు. వాదనలన్నీ విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ రిట్ పిటిషన్ నం.7100/ 2023ని ఏప్రిల్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున దానిపై విచారణ ముగిసిందని, అందువల్ల ఆ ట్రాన్స్ఫర్ పిటిషన్ను తీసుకోరాదని కోరారు. ఆ విషయం తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. న్యాయమూర్తి ఆ విషయాన్ని తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేస్తున్నామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’