‘రూసా’కూ సర్కారు దెబ్బ!
ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జి వారి పాఠ్యపుస్తకాలు, బోధన పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం విభిన్నంగా ఉంటుంది. మనకు, వారికి ఎందుకు తేడా ఉంటుంది? ఇవి చేయకపోతే వెనుకబడతాం.
మాటలతోనే మాయ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్
ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి నిధుల విడుదలలో నిర్లక్ష్యం
కేంద్రం మంజూరు చేస్తున్న రూ.కోట్లను సైతం దారిమళ్లిస్తున్న వైనం
ఈనాడు, అమరావతి
ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జి వారి పాఠ్యపుస్తకాలు, బోధన పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం విభిన్నంగా ఉంటుంది. మనకు, వారికి ఎందుకు తేడా ఉంటుంది? ఇవి చేయకపోతే వెనుకబడతాం
ఈ ఏడాది జులై 13న వీసీల సమావేశంలో సీఎం జగన్ మాటలివి..
- కానీ వాస్తవ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం ఇతర అవసరాలకు మళ్లిస్తే ఉన్నత విద్యా సంస్థలు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జిలతో ఎలా పోటీ పడతాయి? అక్కడున్న మౌలిక సదుపాయాలు మన ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నాయా? కేంద్రం రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ (రూసా) కింద నిధులిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 40 శాతం మ్యాచింగ్ గ్రాంటు కూడా ఇవ్వడం లేదు. నిధులు ఖర్చు చేసి ధ్రువపత్రాలు ఇవ్వాలని కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కేంద్రం 60 శాతం వాటాగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.176.25 కోట్లను నిలిపివేసింది.
ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి నిలపడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇస్తున్న రూసా నిధులను సైతం ఇతర అవసరాలకు వాడేసుకుంటోంది. నిధులు ఖర్చు చేసి ధ్రువపత్రాలు ఇస్తే మిగిలిన వాటిని విడుదల చేస్తామని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చివరకు గుత్తేదార్లు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కితేగాని చెల్లించని దుస్థితి. న్యాయస్థానం ఆదేశాలతో ఇటీవల గుత్తేదార్లకు ప్రభుత్వం రూ.48 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రూసా కింద రెండు విడతలకు కలిపి రూ.857.47 కోట్లు మంజూరు చేసింది. దీనికి రాష్ట్రం వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. 2020 మార్చి నాటికే పనులు పూర్తి కావాల్సి ఉన్నా కరోనా, ఇతర కారణాలతో కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగిస్తూ వస్తోంది. కేంద్రం తన వాటాగా రూ.514.48 కోట్లు ఇవ్వాల్సి ఉండగా..రూ.338.23 కోట్లు విడుదల చేసింది. నిధుల వినియోగం ధ్రువపత్రాలు ఇస్తే 60 శాతం కింద మిగతా రూ.176.25 కోట్లు ఇస్తామంటోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా మౌనంగా ఉంటోంది. దీంతో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనులు నిలిచిపోయాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తే జాతీయ ర్యాంకుల్లోనూ విద్యా సంస్థలు ముందుండేందుకు అవకాశం ఉంటుంది. విద్యపై శ్రద్ధ చూపుతున్నామని, భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న జగన్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాల అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేసింది.
నిధులిస్తామన్నా నిర్లక్ష్యమే..
రూసా కింద ఉన్నత విద్య సంస్థలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులిస్తామన్నా ప్రభుత్వం తన వాటా ఇవ్వలేక నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో పలు వర్సిటీల్లో విద్యార్థినులకు వసతి గృహాలు సక్రమంగా లేవు. కనీస మౌలిక సదుపాయాలూ లేని దుస్థితి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ సరైన వసతులు లేవు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి ? కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. జగన్ ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇస్తున్న నిధులను వాడేసుకుని ఉన్నత విద్య చదివే వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
వర్సిటీలదీ అదే దుస్థితి..
ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు ఒక్కోదానికి రూ.100 కోట్ల చొప్పున కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు.ఇప్పటి వరకు కేవలం రూ.41 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఈ నిధులు ఖర్చు చేస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు నిధులు వ్యయం చేయలేక పోవడంతో వర్సిటీల్లో అభివృద్ధి జరగక పోగా..కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం ఆగిపోయాయి.
- వెనుకబడిన ప్రాంతాల్లో అన్ని సదుపాయాలతో డిగ్రీ విద్య అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన కొత్త ఆదర్శ డిగ్రీ కళాశాలలు (ఎన్ఎండీసీ) ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. రూసా కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 8 ఎన్ఎండీసీలను మంజూరు చేసింది. ఒక్కో దానికి రూ.12 కోట్లు ఇచ్చింది. కేంద్రం నిధులిస్తున్నా ఇప్పటికీ ఎర్రగొండపాలెం, జగ్గంపేట కళాశాలలు పూర్తి కాలేదు. అకడమిక్ భవనం, వసతి గృహాలు, కంప్యూటర్ల ల్యాబ్, గ్రంథాలయం, భోజనశాల, ఆడిటోరియం నిర్మించాల్సి ఉంది.
ఎయిడెడ్ సంస్థలపై వివక్ష..
రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు ఉన్న 33 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు కేంద్రం రూసా కింద నిధులు ఇచ్చింది. విజయవాడలోని ఆంధ్ర లయోలా, ఏలూరులోని థెరిస్సా కళాశాలలకు రూ.5 కోట్ల వంతున, మిగతా 31 కళాశాలలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. ఆంధ్ర లయోలా కళాశాలకు ఇప్పటి వరకు రూ.3.5 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం లేదంటే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని గతంలో ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో నిధుల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత వెనక్కి వెళ్లేందుకు ఐచ్ఛికం ఇవ్వడంతో ఎయిడెడ్లోకి వెళ్లిపోయాయి. వీటికి నిధులు ఇవ్వడంపై ప్రభుత్వం జాప్యం చేస్తోంది. గుంటూరులోని హిందూ కళాశాలకు రూ.2 కోట్లు మంజూరు కాగా.. రూ.కోటి మాత్రమే విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
వందనమమ్మా.. డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!