జగన్ ‘వలలో’ గంగపుత్రుల విలవిల!
మరి ఆ హామీని నిలబెట్టుకున్నారా అంటే ‘ఒడ్డు దాటించే వరకు ఓడ మల్లన్న...ఒడ్డు దాటాక బోడు మల్లన్న’ అన్న చందంగా మత్స్యకారులను సీఎం జగన్ నిలువునా ముంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగపుత్రులకు ఇచ్చిన ప్యాకేజీ, ఉద్యోగ హామీని గంగలో కలిపేశారు.
నాలుగేళ్లుగా నెరవేరని పూడిమడక మత్స్యకారులకు ఇచ్చిన హామీ
ఇంటికో ఉద్యోగం..రూ.5 లక్షల ప్యాకేజీ అంటూ మాయమాటలు
సీఎం మడమ తిప్పడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, అచ్యుతాపురం
సెజ్ నుంచి సముద్రంలోకి వేస్తున్న ఏపీఐఐసీ పైపులైను కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏపాటిది..? మేము అధికారంలోకి వస్తే సెజ్లోని పరిశ్రమల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తాం.. మాకు మద్దతుగా నిలవండి.. మీ జీవితాలను మార్చేస్తాం’
పాదయాత్రలో భాగంగా 2018 ఆగస్టు నెలాఖరున అచ్యుతాపురం వచ్చిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పూడిమడక మత్స్యకార సంఘ నాయకులకు ఇచ్చిన హామీ ఇది..
మరి ఆ హామీని నిలబెట్టుకున్నారా అంటే ‘ఒడ్డు దాటించే వరకు ఓడ మల్లన్న...ఒడ్డు దాటాక బోడు మల్లన్న’ అన్న చందంగా మత్స్యకారులను సీఎం జగన్ నిలువునా ముంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగపుత్రులకు ఇచ్చిన ప్యాకేజీ, ఉద్యోగ హామీని గంగలో కలిపేశారు. నాడు ఎన్నికల్ల్లో లబ్ధి కోసం నెత్తిపై తాటాకు టోపీ, వల చేతపట్టుకుని తనదైన శైలిలో నవ్వుతూ, ముద్దులు పెడుతూ పూడిమడక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతానని డాంబికాలు పలికారు జగన్. ఎన్నికల ప్రచార సభల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎంపీ విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి హామీనే పునరుద్ఘాటిస్తూ వచ్చారు. ఇదంతా నిజమని నమ్మిన మత్స్యకారులు పూడిమడకలో వైకాపాకు ఓట్లు వేసి గెలిపించారు. తీరా గెలిచాక వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీని పక్కన పెట్టేసింది. నాలుగేళ్లుగా ఇదిగో..అదిగో అంటూ నాన్చుతూ గంగపుత్రులను మోసగిస్తోంది. ఇంటికో ఉద్యోగం మాట అటుంచితే.. రూ.5 లక్షల పరిహారం కూడా అందించలేక పోయింది. దీంతో సొంత పార్టీ నాయకులు కూడా ప్రభుత్వ పెద్దల తీరును తప్పుపట్టే పరిస్థితి నెలకొంది.
జగన్ను నమ్మారు.. రెండింటికీ చెడ్డారు..
తెదేపా ప్రభుత్వ హయాంలో అచ్యుతాపురం సెజ్లోని రసాయన పరిశ్రమల వ్యర్థాలను శుద్ధిచేసి పూడిమడక తీరంలో వదిలేందుకు ఏపీఐఐసీ ద్వారా పైపులైను నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయడం వల్ల తాము ఉపాధి కోల్పోతామని అప్పట్లో మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారితో పలు దఫాలు అధికారులు చర్చలు జరిపిన తర్వాత ఆ గ్రామంలో 4,828 మంది మత్స్యకారులకు 2016లో జీవో 131 ద్వారా ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ముందుకొచ్చారు. కొంతమంది పరిహారం తీసుకున్నారు. అయితే ఈ ప్యాకేజీ సరిపోదని 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కొక్కరికి రూ.5 లక్షల వంతున ఇవ్వాలని వైకాపా నాయకులు ఉద్యమబాట పట్టారు. వీరికి ఆ పార్టీ అధినేత జగన్తో పాటు ముఖ్య నాయకులు అప్పట్లో మద్దతు ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు మెరుగైన ప్యాకేజీ అందించడంతో పాటు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించి ఆదుకుంటామని బహిరంగంగా హామీ ఇచ్చారు. వైకాపా మాటలు నమ్మి తెదేపా ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని అప్పట్లో చాలామంది తీసుకోలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది అనకాపల్లి జిల్లా పూడిమడక మత్స్యకారుల పరిస్థితి. గ్రామంలో వెయ్యి మందికి పైగా ఇంకా ప్యాకేజీ అందాల్సి ఉందని స్థానికులు చెబుతుంటే అధికారులు మాత్రం 497 మందికే ఇవ్వాల్సి ఉందంటున్నారు.
మాట తప్పారు..మడమ తిప్పారు
‘మా జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడు’ అని వైకాపా నాయకులు గొప్పగా చెప్పుకొనే మాటలు రివర్స్ అయ్యాయి. పూడిమడక మత్స్యకారులకు ఇచ్చిన హామీ విషయంలో ముఖ్యమంత్రి మడమ తిప్పేశారు. ఎంతలా అంటే ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతలే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించేంతగా ..రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోవడంపై గంగపుత్రులు మండిపడుతున్నారు. ఇదివరకే స్థానిక ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు), మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజులను వైకాపాకు చెందిన మత్స్యకార నాయకులు కలిసి మొర పెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. పరిహారం సంగతి తేల్చాలంటూ ప్లకార్డులు చూపి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వేట సాగక.. వలస బాట
సెజ్ వ్యర్థాలన్నీ సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద తగ్గిపోయి వేట సాగడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుద్ధి చేసిన వ్యర్థాలనే వదులుతున్నామని చెప్పినా గతంతో పోల్చితే చేపలు చిక్కడం లేదంటున్నారు. ఏటా సీజన్లో పూడిమడకను వీడి విశాఖ, కాకినాడ, ఒడిశా ప్రాంతాలకు వలసలు పోతున్నారు. పూడిమడక వద్ద మినీ హార్బర్ నిర్మిస్తామని మూడేళ్లుగా ఊరిస్తున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
వందనమమ్మా.. డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!