Healthy Food: ఎక్కువ పీచు.. తక్కువ ఫ్యాట్.. మధ్యలో నట్స్!
మంచి ఆహారం.. సరైన వ్యాయామంతో వందేళ్ల వరకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమేనని అమెరికాకు చెందిన ప్రఖ్యాత బయాలజిస్టు, సియాటిల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ...
మంచి ఆహారం.. సరైన వ్యాయామాలతో ఆరోగ్యం భద్రం
ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు డాక్టర్ లెరోయ్ హుడ్
ఈనాడు, హైదరాబాద్: మంచి ఆహారం(Healthy Food).. సరైన వ్యాయామంతో వందేళ్ల వరకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమేనని అమెరికాకు చెందిన ప్రఖ్యాత బయాలజిస్టు, సియాటిల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ(ఐఎస్బీ) అధ్యక్షులు, సహ వ్యవస్థాపకులు డాక్టర్ లెరోయ్ హుడ్ అన్నారు. రోజువారీ ఆహారంలో ఎక్కువ పీచు(ఫైబర్), తక్కువ కొవ్వు (ఫ్యాట్) ఉండే పదార్థాలు తీసుకోవాలని సూచించారు. భోజనానికి.. భోజనానికీ మధ్య ఎక్కువ విరామం ఉండాలన్నారు. రాత్రి ఎక్కువ భోజనం తింటే.. మరుసటిరోజు ఉదయం అల్పాహారం తీసుకోకుండా టీ లేదా కాఫీతో సరిపెట్టవచ్చని చెప్పారు. మళ్లీ మధ్యాహ్నం తక్కువ తిని.. రాత్రి ఎక్కువ భోజనం చేయాలన్నారు.
ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బాదం, పిస్తా, వాల్నట్స్ ఎక్కువగా తినాలని సూచించారు. తాను ఇదే విధానం పాటిస్తూ.. బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన వాస్తవ వయసు 82 ఏళ్లు అయినా.. బయోలాజికల్ వయసు 65 సంవత్సరాలేనని తెలిపారు. భారతరత్నకు సమానమైన అమెరికాకు చెందిన నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డును డాక్టర్ లెరోయ్ పొందారు. ఆయన మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో బయో బ్యాంకు ప్రారంభించిన సందర్భంగా ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
బయో బ్యాంకులతో ఉపయోగాలు..
బయో బ్యాంకుల ద్వారా సేకరించిన డీఎన్ఏ సమాచారంతో రానున్న రోజుల్లో వైద్యసేవల రూపురేఖలే మారిపోనున్నాయి. మానవ కణజాల నమూనాలను సేకరించి.. విశ్లేషించి.. తద్వారా డీఎన్ఏలో మార్పులను అంచనా వేయవచ్చు. అంటే పదేళ్లకు ముందు ఆరోగ్యవంతుడిగా ఉన్న ఒక వ్యక్తికి ఆ తర్వాత క్యాన్సర్, లేదా మధుమేహం సోకితే అతని పాత, ప్రస్తుత నమూనాలను పరిశీలించి.. జన్యువుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవచ్చు. ఈ సమాచారంతో రానున్న తరంలో ముందే ఇలాంటి వ్యాధుల ముప్పును పసిగట్టవచ్చు.
ఏ వ్యాధుల్లో జీన్ ఎడిటింగ్ సాధ్యం..
సింగిల్ జీన్లో సమస్యతో వచ్చే సికిల్సెల్ ఎనీమియా, థలసీమియా లాంటి వ్యాధులను జీన్ ఎడిటింగ్తో నివారించవచ్చు. ఈ పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా నైతికపరమైన ఆందోళన ఉన్నమాట నిజం. వచ్చే పదేళ్లలో జీన్ ఎడిటింగ్ చికిత్సల్లో పురోగతి కనిపిస్తుంది. పలు వ్యాధులకు పరిష్కారం లభిస్తుంది. ఇందులో బయో బ్యాంకుల పాత్ర కీలకం కానుంది.
మెదడు ఆరోగ్యంపై మీ పరిశోధనలు..
వాస్తవానికి 30 ఏళ్ల వయసు నుంచే ప్రతి ఒక్కరిలో మెదడు పనితీరు నెమ్మదిస్తుందని పరిశోధనల్లో తేలింది. శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం 25 రకాల ఎక్సర్సైజ్లకు రూపకల్పన చేస్తున్నాం. ముఖ్యంగా మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందిస్తే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకు పులప్స్, ఇతర ఏరోబిక్ వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి.
మధుమేహం నియంత్రణకు సూచనలు..
దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ప్రయత్నించాలంటే.. వాటి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండాలి. ఆయా వ్యాధులకు సంబంధించి వివిధ దశల్లో ఉన్న రోగులను పరిశీలించాలి. ప్రస్తుత ప్రయత్నం అలాంటిదే. ఏఐజీలో చేపడుతున్న ఫినోమ్ ప్రాజెక్టులో భాగంగా గణనీయమైన డేటా అందుబాటులోకి వస్తుంది. ఆ సమాచారాన్ని పరిశోధించడం ద్వారా మధుమేహాన్ని నివారించేందుకు కొత్త పద్ధతుల గురించి ఆలోచించి, ఆవిష్కరించగలుగుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!