Andhra News: కొత్త పోస్టుని సృష్టించి.. కాటమనేని భాస్కర్ మళ్లీ బదిలీ
సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ని ప్రభుత్వం నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో కొత్తగా... పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్
నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి
మరో నలుగురు ఐఏఎస్లకూ స్థానచలనం
ఈనాడు, అమరావతి: సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ని ప్రభుత్వం నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో కొత్తగా... పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ పోస్టుని సృష్టించి భాస్కర్ను దానిలో నియమించింది. ఆయనతో పాటు మరో నలుగురు ఐఏఎస్ అధికారులనూ బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ సి.నాగరాణిని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్గా నియమించారు. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న ఎం.ఎం.నాయక్ను చేనేత, జౌళి శాఖ కమిషనర్గా బదిలీ చేశారు. ఆయనకు ఆప్కో వీసీ, ఎండీగాను, ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగాను పూర్తి అదనపు బాధ్యత అప్పగించారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జి.జయలక్ష్మికి సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యత అప్పగించారు. సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర అదనపు ప్రాజెక్టు డైరెక్టర్గా బి.శ్రీనివాసరావుని నియమించారు. ఆయనకు సీఈఓ, రైతు బజార్ల పోస్టుని పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించారు.
సిఫారసులకు తలొగ్గలేదని..!
కాటమనేని భాస్కర్ ఈ ఏడాది ఏప్రిల్ 4న రవాణాశాఖ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖలో వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగుల బదిలీల విషయంలో ఆయన నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని చెప్పడం కొందరికి రుచించలేదు. ప్రజాప్రతినిధుల సిఫారసులకు ఆయన తలొగ్గలేదు. దాంతో జూన్ 29, 30 తేదీల్లో సాధారణ బదిలీలకు కౌన్సెలింగ్ జరుగుతుందనగా, జూన్ 28న రాత్రి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను అంతగా ప్రాధాన్యం లేని కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్కు కమిషనర్గా నియమించింది. ఇప్పుడు మళ్లీ పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్గా బదిలీ చేసింది. కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్ కమిషనర్ పోస్టునీ ఆయనకు పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది. పాఠశాల విద్యపై శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో... పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియిమంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వం కొత్త పోస్టుని సృష్టించి, భాస్కర్ను దానిలో నియమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!