Twitter: ట్విటర్ యూజర్లకు షాక్.. ట్వీట్స్ చూడటానికి లిమిట్!
ట్విటర్ యూజర్లకు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ షాకిచ్చారు. ట్వీట్స్ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించారు.
దిల్లీ: ట్విటర్ యూజర్లకు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ షాకిచ్చారు. ట్వీట్స్ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించారు. వెరిఫైడ్, అన్వెరిఫైడ్, కొత్త అన్వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా లిమిట్ ఇచ్చారు.
ట్విటర్ (Twitter) సేవల్లో శనివారం రాత్రి నుంచి అంతరాయం ఏర్పడటంపై ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందిచారు. ట్విటర్లో పోస్టులను వీక్షించడంపై తాత్కాలికంగా పరిమితులను తీసుకొచ్చినట్లు ఆయన ప్రకటించారు. ఖాతాల తీరును బట్టి రోజుకు ఎన్ని పోస్టులు వీక్షించ వచ్చో కూడా ఆయన తెలిపారు. ఈ విషయాన్ని శనివారం ఆయన ట్వీట్ చేసి ప్రకటించారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ యూజర్లు ట్వీట్లను యాక్సెస్ చేయలేకపోయారు. యాప్లో నెలకొన్న ఈ అంతరాయంపై పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. కొందరు ట్వీట్లు ఓపెన్ చేస్తుంటే ‘కెనాట్ రీట్రైవ్ ట్వీట్స్’ ‘రేట్ లిమిట్ ఎక్సీడెడ్’ వంటి సందేశాలు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై ట్విటర్ యజమాని మస్క్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ల సమస్యలను పరిష్కరించడానికి ఈ తాత్కాలిక పరిమితులను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ‘‘యూజర్లు ట్విటర్కు బానిసయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయి.. దాని నుంచి బయటపడాల్సిన అవసరముంది. నేను ప్రపంచానికి మంచి చేస్తున్నాను’’ అని సమర్థించుకొన్నారు.
రోజుకు వీక్షించే పోస్టుల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు మస్క్ తన ట్వీట్లో తెలిపారు. వెరిఫైడ్ అకౌంట్కు 6వేల పోస్టులు, అన్ వెరిఫైడ్ అకౌంట్కు 600 పోస్టులు, కొత్త అన్ వెరిఫైడ్ అయిన ఖాతాలు 300 వరకు పోస్టులు వీక్షించవచ్చని అందులో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వీటి పరిమితి పెంచుతామని.. వెరిఫైడ్కు 8 వేలు, అన్వెరిఫైడ్కు 800, కొత్త అన్వెరిఫైడ్కు 400 పోస్టులు రోజులో వీక్షించవచ్చని మరో ట్వీట్లో వెల్లడించారు. శనివారం రాత్రి నుంచి ట్విటర్ సేవలకు అంతరాయం ఏర్పడడంతో #twitterdown హ్యాష్ట్యాగ్ను ట్రెండ్లోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
డ్రోన్ల తయారీ సంస్థ దక్ష అన్మ్యాన్డ్ సిస్టమ్స్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వాటా పెంచుకుంది. ఈ సంస్థలో ఇప్పటికే రెండు దఫాలుగా కోరమాండల్ ఇంటర్నేషనల్ పెట్టుబడి పెట్టింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం