Indian Railway: రైలు ప్రయాణం వాయిదా పడిందా? క్యాన్సిలేషన్ ఛార్జీలు పడొద్దంటే..?
Train ticket reschedule: ప్రయాణికులు పూర్తిగా ప్రయాణాన్ని రద్దు చేసుకోకుండా, ముందు లేదా తర్వాతి తేదీలకు ప్రయాణాన్ని మార్చుకోవాలనుకుంటే, క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండానే టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఫలానా తేదీన రైలు ప్రయాణం (Train Journey) అనుకున్నప్పుడు టికెట్లను ముందుగానే రిజర్వేషన్ చేసిపెట్టుకుంటాం. ఒక్కోసారి అనుకున్న షెడ్యూల్లో ఏదైనా మార్పులు వచ్చి ప్రయాణాన్ని ముందుగానే చేయాల్సి రావొచ్చు. లేదంటే వాయిదా వేయాల్సి రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో టికెట్ రద్దు (Ticket cancellation) చేసి మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. టెకెట్ రద్దు చేసుకుంటే రైల్వే శాఖ క్యాన్సిలేషన్ రుసుములు మినహాయించుకుని మిగిలిన డబ్బును మాత్రమే తిరిగి చెల్లిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు కొంత డబ్బును నష్టపోతుంటారు.
అయితే, ప్రయాణికులు పూర్తిగా ప్రయాణాన్ని రద్దు చేసుకోకుండా ముందు లేదా తర్వాతి తేదీలకు ప్రయాణాన్ని మార్చుకోవాలనుకుంటే, క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండానే టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు రైలు ప్రయాణం ప్రారంభం కావడానికి కనీసం 48 గంటల ముందే రిజర్వేషన్ కౌంటర్ పనివేళల్లో వెళ్లి మీ టికెట్ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మీరు ఏ తేదీన ఏ సమయంలో ప్రయాణించాలనుకుంటున్నారో రిజర్వేషన్ కార్యాలయంలోని ఉద్యోగులకు తెలియజేయాలి. ఈ సమయంలో ప్రయాణికులు ప్రయాణపు తరగతిని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు.
రిజర్వేషన్ కౌంటర్ అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి మీరు కావాలనుకుంటున్న తేదీరోజు టికెట్లు అందుబాటులో ఉంటే సర్దుబాటు చేస్తారు. ఇందుకోసం అదనపు ఛార్జీలు తీసుకోరు. ఒకవేళ మీరు తరగతిని అప్గ్రేడ్ చేసినట్లయితే.. తగిన టికెట్ ధరను మాత్రం తీసుకుంటారు. ఈ సదుపాయం కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారితో పాటు, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారు సైతం ఒకసారి ఉపయోగించుకోవచ్చు.
బోర్డింగ్ స్టేషన్నూ మార్చుకోవచ్చు..
రైలు మొదటి రిజర్వేషన్ ఛార్ట్ను సిద్ధం చేయడానికి ముందే ఇందుకోసం అభ్యర్థించాల్సి ఉంటుంది. చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ లేదా డ్యూటీలో ఉన్న రిజర్వేషన్ సూపర్వైజర్కి.. ఏదైనా కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ (PRS) సెంటర్లో పనిగంటల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ ద్వారా లేదా 139 ద్వారా, కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ కౌంటర్ల ద్వారా ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ సౌకర్యం ఉంది. ప్రయాణపు టికెట్ బోర్డింగ్ పాయింట్ మార్చుకున్నంత మాత్రాన ప్రయాణించని దూరానికి రిఫండ్ రాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి