ఆన్లైన్ గేమింగ్పై 28% పన్ను
ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, కేసినోల్లో.. పూర్తి పందెం విలువపై 28% పన్ను విధించాలని మంగళవారం జరిగిన జీఎస్టీ మండలి 50వ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
సినిమాహాళ్లలో ఆహార పానీయాలపై పన్ను 5 శాతానికి తగ్గింపు
జీఎస్టీ మండలి నిర్ణయం
దిల్లీ: ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, కేసినోల్లో.. పూర్తి పందెం విలువపై 28% పన్ను విధించాలని మంగళవారం జరిగిన జీఎస్టీ మండలి 50వ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ఈ పన్ను రేటును జీఎస్టీ మండలి నిర్ణయించింది. నైపుణ్య ఆధారిత/అదృష్టం ఆధారిత గేమ్లా అనే వర్గీకరణ చేయకుండానే ఆన్లైన్ గేమింగ్పై పన్ను విధించడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్లు, కేసినోలకు గరిష్ఠ పన్ను విధించాలనే నిర్ణయం వెనక పరిశ్రమను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అత్యవసర వస్తువులకు విధిస్తున్న స్థాయిలోనే, వీటికి పన్ను రేట్లు ఉండొచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్కు ప్రస్తుతం పన్ను సంబంధిత అంశంపైనే జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుందని, నియంత్రణ పరమైన అంశాన్ని ఐటీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని ఆమె వివరించారు. యువత ఆన్లైన్ గేమింగ్కు బానిసలు కాకుండా నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై ఏవైనా గేమింగ్ కంపెనీలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. ప్రభుత్వం పోరాడేందుకు సిద్ధంగా ఉందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, కేసినోలను నిర్వచించేందుకు జీఎస్టీ చట్టంలో సవరణలు చేయనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్కు గరిష్ఠ జీఎస్టీ రేటును విధించడాన్ని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ వ్యతిరేకించింది.వ్యాపార విస్తరణ పైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
రెస్టారెంట్ల మాదిరే
సినిమా హాళ్లలో పానీయాలు, ఆహార పదార్ధాలపై సేవా పన్నును 5 శాతానికి తగ్గించింది. సినిమా టికెట్లపై (రూ.100లోపు ఉంటే 12%, రూ.100 పైన ఉంటే 18%) వర్తింపజేస్తున్న పన్ను కాకుండా.. రెస్టారెంట్లలో విధిస్తున్న తరహాలో 5 శాతం పన్నే ఆహార, పానీయాలపై విధించనున్నారు. జీఎస్టీ మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మల్టీప్లెక్స్ ఆపరేటర్లు స్వాగతించారు. థియేటర్ల వ్యాపారం పుంజుకునేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
యుటిలిటీ వాహనాలు అంటే..
యుటిలిటీ వాహనాలకు సంబంధించి, 28% జీఎస్టీకి అదనంగా 22 శాతం సెస్ విధింపునకు ‘యుటిలిటీ వాహనం’ నిర్వచనంలోనూ జీఎస్టీ మండలి మార్పు చేసింది. 1500 సీసీ లేదా అంతకుమించి ఇంజిన్ సామర్థ్యం, 4 మీటర్లు లేదా అంతకుమించి పొడువు, అన్- ల్యాడెన్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎం ఉన్న యుటిలిటీ వాహనాలకే సెస్ విధించనున్నట్లు పేర్కొంది.
వీటికి మినహాయింపు
కేన్సర్ ఔషధం దినుటక్సిమాబ్, అరుదైన వ్యాధుల చికిత్సలో వాడే మరికొన్ని ఔషధాల దిగుమతులపై జీఎస్టీ నుంచి మినహాయింపును ఇస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వైద్య అవసరాల కోసం (ఎఫ్ఎస్ఎమ్పీ) ఉపయోగించే ఆహార పదార్థాల దిగుమతులతో పాటు ప్రైవేట్ సంస్థలు అందించే శాటిలైట్ ప్రయోగ సేవలకు కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సీతారామన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటి ప్రయోజనాలు సహా పూర్తి వివరాలు చూద్దాం... -
యూనియన్ బ్యాంక్ లాభం రూ.3,328 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రూ.3,328 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 18.36 శాతం ఎక్కువ. -
మన ల్యాబ్ తయారీ వజ్రాలు విదేశాల్లో మెరుస్తున్నాయ్
ల్యాబ్ తయారీ వజ్రాల (ఎల్జీడీ) ఎగుమతులు 2024-25లో 7-9 శాతం వృద్ధి చెంది 1500-1530 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12,450-12,700 కోట్ల)కు చేరొచ్చని కేర్ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక అంచనా వేసింది. సహజంగా వెలికితీసే వజ్రాలకు గిరాకీ మందకొడిగా ఉండటం ఇందుకు దోహదపడనున్నట్లు తెలిపింది. -
భారత కంపెనీల ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించొచ్చు
గత ఆర్థిక సంవత్సరం(2023-24) జనవరి-మార్చి త్రైమాసికంలో భారత కంపెనీల ఆదాయాలు 4-6 శాతమే పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. కొవిడ్-19 పరిణామాల ప్రభావం నుంచి కంపెనీలు పుంజుకోవడం ప్రారంభమైన 2021 సెప్టెంబరు తర్వాత ఒక త్రైమాసికంలో ఇదే అత్యంత తక్కువ ఆదాయ వృద్ధి అని తెలిపింది. -
తొలి 100 రోజుల్లో ఇండియా ఏఐ మిషన్ ఆవిష్కరణ!
అధికారం చేపట్టిన ‘తొలి 100 రోజుల ప్రణాళిక’లో భాగంగా ‘ఇండియా ఏఐ మిషన్’ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కింద 2024-25 ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయించొచ్చని ఒక అధికారిని ఉటంకిస్తూ ‘ఇన్ఫామిస్ట్’ తన కథనంలో పేర్కొంది. -
2024-25లో భారత వృద్ధి 7 శాతానికి పైనే
అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో సానుకూలతలు, సాధారణానికి మించి వర్షపాతం అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేయొచ్చని ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ ఎన్సీఏఈఆర్ అంచనా వేసింది. -
గ్రామ పంచాయతీల్లోకి ‘బీమా’ సేవలు
గ్రామ పంచాయతీలకు జీవిత, సాధారణ బీమా కంపెనీలు తమ సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్లు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రకటించింది. ‘2047 కల్లా అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. -
ఒమేగా హాస్పిటల్స్లో మోర్గాన్ స్టాన్లీకి వాటా
క్యాన్సర్ ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఒమేగా హాస్పిటల్స్లో విదేశీ పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ దాదాపు రూ.600 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఈ సంస్థకు ఒమేగా హాస్పిటల్స్లో 15 శాతం వరకూ వాటా లభిస్తుంది. -
సీసీఎల్ ప్రోడక్ట్స్కు తగ్గిన లాభాలు
ఇన్స్టెంట్ కాఫీ తయారీ సంస్థ అయిన సీసీఎల్ ప్రోడక్ట్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.730 కోట్ల ఆదాయాన్ని, రూ.65.22 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.4.90గా నమోదైంది. -
ఏఐ ప్రాజెక్టులపై బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ దృష్టి
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.213.34 కోట్ల ఆదాయాన్ని, రూ.8.41 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
క్యాప్స్టన్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు
మ్యాన్ పవర్, స్టాఫింగ్ సేవల సంస్థ అయిన క్యాప్స్టన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి, నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ సంస్థ రూ.521 కోట్ల ఆదాయాన్ని, రూ.12.57 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
కూల్ నుంచి అధునాతన కూలర్
కూల్ స్టైలిష్ ఫ్యాన్స్ సరికొత్త ‘డెజర్ట్ కూలర్ ఎక్సెల్ హెచ్1’ కూలర్ను తీసుకొచ్చింది. అధునాతన బీఎల్డీసీ మోటార్, రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఫ్యాన్ విద్యుత్ను 65% వరకు ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటికి సరికొత్త స్టైల్, అందాన్ని తీసుకొస్తుందని వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(5)
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐషర్ మోటార్స్ ఏకీకృత నికర లాభం రూ.1,070 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లాభం రూ.906 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అధిక విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. -
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ
గత నెల రోజులుగా బెంగళూరులో ఉంటున్న టెక్ జపాన్ వ్యవస్థాపకుడు భారతీయ నాయకత్వం గురించి కొనియాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా మ్యాచ్ ముగిసినా వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి