ఓలా కొత్త విద్యుత్ స్కూటర్లు,బైౖకులు
ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త ప్రారంభ స్థాయి విద్యుత్ స్కూటర్ ఎస్1ఎక్స్ను విపణిలోకి విడుదల చేసింది. దీని పరిచయ ధర రూ.79,999 గా తెలిపింది.
పరిచయ ధర రూ.79,999
దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త ప్రారంభ స్థాయి విద్యుత్ స్కూటర్ ఎస్1ఎక్స్ను విపణిలోకి విడుదల చేసింది. దీని పరిచయ ధర రూ.79,999 గా తెలిపింది. ఈ స్కూటర్ ఎస్1ఎక్స్ (2 కిలోవాట్ బ్యాటరీ), ఎస్1ఎక్స్ (3 కిలోవాట్ బ్యాటరీ), ఎస్1ఎక్స్+ (3 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్లుగా లభించనుంది. ఎస్1ఎక్స్ (2 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్ మొదటి వారం రూ.79,999కు లభిస్తుందని, అనంతరం ధర రూ.89,999 కానుందని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. బుకింగ్స్ ప్రారంభించామని, డిసెంబరు నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రోజుకు దాదాపు 10-20 ప్రయాణాల కోసం వీలుగా ఈ స్కూటర్ను రూపొందించినట్లు వివరించారు.
- ఎస్1ఎక్స్ (3 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్ మొదటి వారం రూ.89,999కు లభిస్తుంది. అనంతరం దీని ధర రూ.99,999 కానుంది.
- ఎస్1ఎక్స్+ స్కూటర్ మొదటి వారం రోజుల పాటు రూ.99,999, అనంతరం రూ.1,09,999కు లభించనుంది. సెప్టెంబరు చివరి నుంచి వీటి డెలివరీలు ప్రారంభించనున్నారు.
- ఎస్1ఎక్స్, ఎస్1ఎక్స్+ మధ్య సాఫ్ట్వేర్, అనుసంధానత ఫీచర్లలో మార్పులు ఉంటాయని భవీష్ తెలిపారు. ఎస్1ఎక్స్ ఒకసారి ఛార్జింగ్తో 151 కి.మీ నడుస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ.
రెండో తరం ఎస్1ప్రో: ఓలా ఎలక్ట్రిక్ రెండో తరం ఎస్1ప్రో స్కూటర్ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1,47,999 (ఎక్స్-షోరూమ్). సెప్టెంబరు మధ్య నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. కొత్త స్కూటర్లతో కలిపి ఓలా విద్యుత్తు వాహనాల్లో ఎస్1ఎక్స్ (2 కి.వా), ఎస్1ఎక్స్, ఎస్1ఎక్స్+, ఎస్1ఎయిర్, ఎస్1ప్రో మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.89,999 నుంచి రూ.1.47 లక్షల మధ్య ఉన్నాయి.
వచ్చే ఏడాది మోటార్సైకిళ్లు: ఓలా ఎలక్ట్రిక్, 4 విద్యుత్తు మోటార్సైకిళ్లు డైమండ్హెడ్, అడ్వెంచర్, రోడ్స్టర్, క్రూయిజర్లను కూడా ప్రదర్శించింది. 2024 చివరకు వీటిని విపణిలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీల అభివృద్ధి కోసం ఎంఅండ్ఎం రూ.12 వేల కోట్ల పెట్టుబడి
MEAL (మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్)లో రూ.12,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి మహీంద్రా & మహీంద్రా అంగీకారం తెలిపింది. -
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
PIN: పుట్టిన రోజు, ఫోన్ నంబర్, ‘‘1234’’, ‘‘0000’’.. ఇలా సులభమైన పిన్లను సెట్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లే. -
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
యాపిల్ నుంచి రాబోయే ఉత్పత్తులకు సంబంధించి తాజాగా కొన్ని లీకులు బయటికొచ్చాయి. ఇందులో ఎస్ఈ4 రాబోయే తేదీ కూడా రివీల్ అయ్యింది. -
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
Moto Edge 50 Fusion: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో మోటో మరో కొత్త ఫోన్ను భారత్లో విడుదల చేసింది. -
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
Blinkit: బ్లింకిట్లో ఇక కూరగాయలు కొంటే కొత్తిమీరను ఉచితంగా ఇస్తారట. ఓ తల్లి సూచనతో కంపెనీ సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. -
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 386 పాయింట్లు పుంజుకొని 73,373 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 22,310 దగ్గర కొనసాగుతోంది. -
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు