మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి.
బ్యాంకింగ్ షేర్ల దూకుడు.. సూచీలకు భారీ లాభాలు
సమీక్ష
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. దేశీయంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ కీలకమైన 22,600 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు అండగా నిలిచాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.45 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.51% నష్టంతో 89.04 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సోమవారం రూ.2.48 లక్షల కోట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన రూ.406.52 లక్షల కోట్లు (4.90 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 73,982.75 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, 74,721.15 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 941.12 పాయింట్ల లాభంతో 74,671.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 223.45 పాయింట్లు పెరిగి 22,643.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,441.90- 22,655.80 పాయింట్ల మధ్య కదలాడింది.
- ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 4.67% పరుగులు తీసి రూ.1,158.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.1,163.25 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. బ్యాంక్ మార్కెట్ విలువ రూ.36,555.4 కోట్లు పెరిగి రూ.8.14 లక్షల కోట్లకు చేరింది.
- అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 2.93% లాభంతో రూ.9,984 వద్ద, యెస్ బ్యాంక్ షేరు 3.67% పెరిగి రూ.27.11 దగ్గర ముగిశాయి.
- మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్సీఎల్ టెక్ షేరు 5.79% కుదేలై రూ.1,387.10 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.23,120.42 కోట్లు తగ్గి రూ.3.76 లక్షల కోట్లకు చేరింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 26 లాభపడ్డాయి. ఎస్బీఐ 3.09%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.90%, యాక్సిస్ బ్యాంక్ 2.60%, ఎన్టీపీసీ 2.07%, కోటక్ బ్యాంక్ 1.98%, టీసీఎస్ 1.51%, బజాజ్ ఫైనాన్స్ 1.45%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.26%, సన్ఫార్మా 1.18%, నెస్లే 1.08% రాణించాయి. ఐటీసీ 0.44%, విప్రో 0.37% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. బ్యాంకింగ్ 2.70%, ఆర్థిక సేవలు 1.81%, యుటిలిటీస్ 1.12%, విద్యుత్ 0.90%, ఇంధన 0.79% మెరిశాయి. స్థిరాస్తి, సేవలు నిరాశపరిచాయి. బీఎస్ఈలో 1982 షేర్లు లాభాల్లో ముగియగా, 1934 స్క్రిప్లు నష్టపోయాయి. 172 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- మెడికా సినర్జీలో మణిపాల్ హాస్పిటల్స్కు 87% వాటా: కోల్కతా కేంద్రంగా పనిచేసే ఆసుపత్రుల సంస్థ మెడికా సినర్జీలో 87% వాటా కొనుగోలు చేసేందుకు తప్పనిసరిగా అమలయ్యే ఒప్పందం చేసుకున్నట్లు మణిపాల్ హాస్పిటల్స్ సోమవారం ప్రకటించింది. లావాదేవీ విలువను వెల్లడించలేదు. తూర్పు రాష్ట్రాల్లో విస్తరించాలన్న వ్యూహంలో భాగంగా ఈ కొనుగోలు చేపట్టినట్లు మణిపాల్ హాస్పిటల్స్ ఎండీ, సీఈఓ దిలీప్ జోస్ తెలిపారు. తమ పోర్ట్ఫోలియోలో మెడికా సినర్జీని కలుపుకుని, రీబ్రాండింగ్ చేస్తామని వెల్లడించారు. మెడికా కొనుగోలుతో మణిపాల్ హాస్పిటల్స్ పడకల సామర్థ్యం 9500 నుంచి 10,500కు పెరుగుతోంది.
- 20 అరుదైన ఖనిజాల గనుల వేలం జూన్లో: దాదాపు 20 అరుదైన ఖనిజాల గనుల నాలుగో విడత వేలాన్ని జూన్ ఆఖరులో నిర్వహించనున్నట్లు కేంద్ర గనుల కార్యదర్శి వీఎల్ కాంతారావు తెలిపారు. మొదటి విడత కింద 7 అరుదైన గనుల వేలం ప్రక్రియ దాదాపు పూర్తయిందని, నెల రోజుల్లో ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలను అరుదైనవిగా పరిగణిస్తారు.
- ఆరోగ్య సంరక్షణ టెక్ సంస్థ ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ మే 6న ప్రారంభమై 8న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.430- 452 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1,842 కోట్లు సమీకరించనుంది. యాంకర్ మదుపర్లు మే 3న బిడ్లు దాఖలు చేయొచ్చు. రిటైల్ మదుపర్లు కనీసం 33 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
- దక్షిణ ముంబయిలో కొత్తగా చేపట్టిన గృహ ప్రాజెక్ట్లో రూ.1300 కోట్ల విలువైన విలాస ఫ్లాట్లను విక్రయించినట్లు ప్రెస్టీజ్ గ్రూప్ వెల్లడించింది.
- గురుగ్రామ్లో విలాస గృహ ప్రాజెక్ట్ రెండో దశ మొదటి రోజునే రూ.300 కోట్లకు పైగా విలువైన 50 ఫ్లాట్లు అమ్ముడుపోయినట్లు తులిప్ ఇన్ఫ్రాటెక్ తెలిపింది.
- దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో రూ.1036 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లును కేఈసీ ఇంటర్నేషనల్ దక్కించుకుంది.
నేటి బోర్డు సమావేశాలు: ఐఓసీ, ఆర్ఈసీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, క్యాస్ట్రోల్, సెంట్రల్ బ్యాంక్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, హావెల్స్, ఇండస్ టవర్, మోల్డ్టెక్ టెక్నాలజీస్, స్టార్ హెల్త్, సింఫనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
యాపిల్ నుంచి రాబోయే ఉత్పత్తులకు సంబంధించి తాజాగా కొన్ని లీకులు బయటికొచ్చాయి. ఇందులో ఎస్ఈ4 రాబోయే తేదీ కూడా రివీల్ అయ్యింది. -
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
Moto Edge 50 Fusion: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో మోటో మరో కొత్త ఫోన్ను భారత్లో విడుదల చేసింది. -
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
Blinkit: బ్లింకిట్లో ఇక కూరగాయలు కొంటే కొత్తిమీరను ఉచితంగా ఇస్తారట. ఓ తల్లి సూచనతో కంపెనీ సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. -
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 386 పాయింట్లు పుంజుకొని 73,373 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 22,310 దగ్గర కొనసాగుతోంది. -
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!