పన్ను రాయితీలను ‘ఊహాజనిత నష్టం’గా ఎలా పరిగణిస్తారు?
ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత సీఏజీకి లేదు
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
దిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి నష్టం చేసేవే కానీ, మేలు చేయవని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జస్ట్ ఏ మెర్సీనరీ..నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ అనే పుస్తకంలో దువ్వూరి తన అనుభవాలు వెల్లడించిన విషయం విదితమే. ఇందులో 2జీ స్ప్రెక్ట్రమ్ ధర నిర్ణయించే విషయంలో పరిశీలించిన అంశాలు, అప్పటి పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. ‘ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం టెలికాం సేవలను ప్రజలకు బాగా దగ్గర చేయాలనే లక్ష్యంతో కొంత ఆదాయాన్ని కోల్పోవటానికి సిద్ధమైంది, దాని మీద సీఏజీ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ‘ఊహాజనిత నష్టం’ వచ్చిందని వ్యాఖ్యానించవచ్చా’ అని దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. ఈ విధమైన అభిప్రాయానికి రావటానికి సీఏజీని అనుమతిస్తే, మరి బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించే ప్రతి పన్ను రాయితీని ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా? అని ఆయన అన్నారు. కొన్ని సందర్భాల్లో పన్ను ఆదాయం కంటే విస్తృత ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని దువ్వూరి వివరించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు 2జీ స్ప్రెక్ట్రమ్ను విక్రయించాలనే అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి సీఏజీకి హక్కు ఎక్కడిదని సుబ్బారావు నిలదీశారు.
ఇదీ జరిగింది
దేశవ్యాప్తంగా 23 టెలికాం సర్కిళ్ల పరిధిలో 2జీ స్ప్రెక్ట్రమ్ కేటాయింపు విషయంలో ఎక్కువ మంది ఆపరేటర్లకు లైసెన్సులు ఇవ్వడం ద్వారా అధిక పోటీ సృష్టించాలని, తత్ఫలితంగా ప్రజలకు మేలు జరుగుతుందని 2007లో అప్పటి ప్రభుత్వం, టెలికామ్ మంత్రి ఏ. రాజా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా ఆమోదించింది. 2001లో వేలంలో నిర్ణయించిన ధరనే దీనికీ వర్తింపజేశారు. 2001లో కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ప్రకారం ఈ విషయంలో టెలికాం విభాగం, ఆర్థిక శాఖలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశం ఆర్థిక శాఖ పరిశీలనకు వచ్చినప్పుడు ‘2007లో స్ప్రెక్ట్రమ్ను, 2001 ధరల ప్రకారం విక్రయించటం సరికాదనే అభిప్రాయానికి నేను వచ్చాను. అందువల్ల మళ్లీ వేలం ద్వారా ధర నిర్ణయించాలని సూచించాను’ అని దువ్వూరి సుబ్బారావు తన పుస్తకంలో వెల్లడించారు. కానీ ‘స్పెక్ట్రమ్కు మళ్లీ కొత్తగా ధర నిర్ణయించాల్సిన అవసరం లేదని, ట్రాయ్ సిఫారసు చేసినట్లుగా 2001 ధరనే వర్తింపజేయాలని’ టెలికాం విభాగం నిర్ణయించింది. తక్కువ ధర వల్ల ఎక్కువ మంది ఆపరేటర్లు ముందుకు వస్తారని, తద్వారా పోటీ పెరిగి ప్రజలకు తక్కువ ధరలో టెలికాం సేవలు లభిస్తాయనేది టెలికాం విభాగ అభిప్రాయం కావచ్చని దువ్వూరి పేర్కొన్నారు. ధర విషయంలో ఏకాభిప్రాయం రానప్పటికీ, టెలికాం విభాగం దరఖాస్తులు పిలిచి, 46 కంపెనీలకు 120 లైసెన్సులు జారీ చేసింది. 2001 ధర ప్రకారమే లైసెన్సు ఇస్తున్నప్పటికీ, ఆర్థిక శాఖ అభిప్రాయాన్ని బట్టి, భవిష్యత్తులో ధర మారే అవకాశం ఉందనే నిబంధనను లైసెన్సు ఒప్పందంలో పొందుపరిచారు. ఆ తర్వాత ఈ వ్యవహారం వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో 2010 నవంబరులో సీఏజీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. స్ప్రెక్ట్రమ్ను తక్కువ ధరకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేరకు నష్టం వచ్చిందని ఈ నివేదికలో సీఏజీ తన అభిప్రాయాన్ని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
యాపిల్ నుంచి రాబోయే ఉత్పత్తులకు సంబంధించి తాజాగా కొన్ని లీకులు బయటికొచ్చాయి. ఇందులో ఎస్ఈ4 రాబోయే తేదీ కూడా రివీల్ అయ్యింది. -
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
Moto Edge 50 Fusion: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో మోటో మరో కొత్త ఫోన్ను భారత్లో విడుదల చేసింది. -
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
Blinkit: బ్లింకిట్లో ఇక కూరగాయలు కొంటే కొత్తిమీరను ఉచితంగా ఇస్తారట. ఓ తల్లి సూచనతో కంపెనీ సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. -
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 386 పాయింట్లు పుంజుకొని 73,373 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 22,310 దగ్గర కొనసాగుతోంది. -
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?