కోఫోర్జ్ చేతికి సిగ్నిటీ టెక్నాలజీస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్ లిమిటెడ్ (గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్) సొంతం చేసుకోనుంది.
54% వాటా కొనుగోలుకు నిర్ణయం
ప్రమోటర్లు, ఇతర వాటాదార్లతో ఒప్పందం
ఒక్కో షేరు ధర రూ.1,415
సాధారణ వాటాదార్లకు ఓపెన్ ఆఫర్
లావాదేవీ విలువ దాదాపు రూ.2,000 కోట్లు
ఈనాడు - హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్ లిమిటెడ్ (గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్) సొంతం చేసుకోనుంది. ఈ మేరకు సిగ్నిటీ టెక్నాలజీస్ ప్రమోటర్లు, ఇతర వాటాదార్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోఫోర్జ్ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటాను దాదాపు రూ.2000 కోట్లకు కోఫోర్జ్ కొనుగోలు చేస్తుంది. దీనికోసం సిగ్నిటీ టెక్నాలజీస్ షేరుకు రూ.1415 చొప్పున చెల్లిస్తుంది. సిగ్నిటీ టెక్నాలజీస్ ప్రమోటర్లలో చక్కిలం వెంకట సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి చక్కిలం, శ్రీకాంత్ చక్కిలం, పెన్నం సుధాకర్, పెన్నం స్వప్న తదితరులకు సంస్థలో 32.77% వాటా ఉండగా, 32.47% విక్రయించనున్నారు. సెబీ నిబంధనల ప్రకారం సిగ్నిటీ టెక్నాలజీస్ సాధారణ వాటాదార్ల నుంచి షేర్లు కొనుగోలు చేయడానికి కోఫోర్జ్ ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేయాల్సి వస్తుంది.
2023-24లో రూ.95 కోట్ల లాభం
సిగ్నిటీ టెక్నాలజీస్ 2023-24లో రూ.814.47 కోట్ల టర్నోవర్పై రూ.94.79 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ చేతిలో రూ.350 కోట్లకు పైగా నగదు నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీలో 54% వాటా కొనుగోలు పూర్తయితే, దీనిపై అజమాయిషీ కోఫోర్జ్ చేతికి వెళ్తుంది. ఈ ప్రక్రియ 6 నెలల్లో పూర్తవుతుందని సమాచారం. గురువారం స్టాక్మార్కెట్ ట్రేడింగ్ సమయం ముగిశాక, కోఫోర్జ్ లిమిటెడ్, సిగ్నిటీ టెక్నాలజీస్ విడివిడిగా ఈ నిర్ణయాలను వెల్లడించాయి. అంతకంటే ముందు బీఎస్ఈలో సిగ్నిటీ టెక్నాలజీస్ షేరు రూ.1372 వద్ద, కోఫోర్జ్ షేరు రూ.4986 వద్ద ముగిశాయి.
రూ.2100 కోట్ల రుణ ప్రతిపాదన
సిగ్నిటీ టెక్నాలజీస్లో మెజార్టీ వాటా కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన కోఫోర్జ్ డైరెక్టర్ల బోర్డు, 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,100 కోట్లు) అప్పు తీసుకోవడానికీ అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం కోఫోర్జ్ లిమిటెడ్కు సింగపూర్లోని అనుబంధ సంస్థ కోఫోర్జ్ పీటీఈ లిమిటెడ్, హెచ్ఎస్బీసీ- గిఫ్ట్ సిటీ బ్రాంచ్తో రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రుణ నిధులను సిగ్నిటీ టెక్నాలజీస్లో మెజార్టీ వాటా కొనుగోలు కోసం వెచ్చించనున్నట్లు కోఫోర్జ్ వెల్లడించింది.
ఇటీవల కాలంలో హైదరాబాద్ ఐటీ రంగంలో నమోదైన పెద్ద లావాదేవీగా సిగ్నిటీ టెక్నాలజీస్- కోఫోర్జ్ ఒప్పందం నిలవనుంది. సిగ్నిటీని సొంతం చేసుకోవడం ద్వారా ఐటీ టెస్టింగ్ సేవల్లో అత్యంత క్రియాశీలక సంస్థగా ఎదిగే అవకాశం కోఫోర్జ్కు లభిస్తుందని సంబంధిత వర్గాలు వివరించాయి.
కోఫోర్జ్ లాభం రూ.224 కోట్లు
మార్చి త్రైమాసికంలో కోఫోర్జ్ నికర లాభం రూ.223.7 కోట్లుగా ఉంది. 2022-23 ఇదే కాల లాభం రూ.114.8 కోట్లతో పోలిస్తే, ఇది 94.86% అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ.2170 కోట్ల నుంచి రూ.2358.5 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం రూ.808 కోట్లు, ఆదాయం రూ.9179 కోట్లుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
Blinkit: బ్లింకిట్లో ఇక కూరగాయలు కొంటే కొత్తిమీరను ఉచితంగా ఇస్తారట. ఓ తల్లి సూచనతో కంపెనీ సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. -
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 386 పాయింట్లు పుంజుకొని 73,373 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 22,310 దగ్గర కొనసాగుతోంది. -
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ప్రజలకు ఊరట.. ఐదు రోజులపాటు వర్షం
-
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
-
విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?
-
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
-
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
-
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!