ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు.
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఫలితంగా.. అవసరమైనప్పుడు బీమా పాలసీ అండగా ఉండలేక పోతోంది. సాధారణంగా క్లెయిం తిరస్కరణకు దారి తీసే సందర్భాలు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బీమా పాలసీలను అర్థం చేసుకోవడం చాలా సులభం. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఎప్పటికప్పుడు పాలసీల నిబంధనల్లో మార్పులు, చేర్పులు తీసుకొస్తూనే ఉంది. బీమా పాలసీలకు సంబంధించి పూర్తి సమాచారం పాలసీదారులకు అర్థమయ్యేలా ఇవ్వాలని సంస్థలకు సూచించింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే బీమా కంపెనీలు ఆరోగ్య బీమాను జారీ చేస్తున్నాయి. పూర్తి నిబంధనలను చదివి, వాటిని అవగాహన చేసుకునే సామర్థ్యం అందరికీ ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన నిబంధనల గురించైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆరోగ్య సమాచారం సరిగా లేకపోవడం: క్లెయిం తిరస్కరణకు అత్యంత సాధారణ కారణాలలో ఇది ఒకటి. పాలసీని కొనుగోలు చేసే సమయంలో వ్యక్తులు తమ ఆరోగ్యం గురించి సరైన సమాచారాన్ని అందించాలి. ఇప్పటికే ఉన్న వ్యాధుల వివరాలు పూర్తిగా తెలియజేయాలి. బీమా సంస్థ దీన్ని అర్థం చేసుకొని, సరైన పాలసీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ముందస్తు వ్యాధుల గురించి తెలియజేయాల్సిందిగా బీమా సంస్థ ఇచ్చే సూచనలు చాలామంది పట్టించుకోరు. క్లెయిం సందర్భంలో ఇలాంటివి బయటపడినప్పుడు తిరస్కరణకు అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బీమా సంస్థ పాలసీని రద్దు చేసే అవకాశాలూ ఉంటాయి.
శాశ్వత మినహాయింపులు, నిరీక్షణ వ్యవధి: కొన్ని రకాల వ్యాధులకు పరిహారం ఇచ్చేందుకు నిర్ణీత వేచి ఉండే సమయం ఉంటుంది. ఈ గడువు లోపు క్లెయిం చేస్తే బీమా సంస్థ దాన్ని చెల్లించకపోవచ్చు. ఈ వ్యవధి ఏడాది నుంచి నాలుగేళ్ల వరకూ ఉండొచ్చు. ఈ వేచి ఉండే వ్యవధి ముగిసిన తర్వాతే వీటికి బీమా రక్షణ ప్రారంభమవుతుంది. కొన్ని వ్యాధులకు శాశ్వతంగా మినహాయింపు వర్తిస్తుందని పాలసీ ఇచ్చేటప్పుడే చెబుతాయి. అలాంటప్పుడు ఆ వ్యాధుల చికిత్సకు అయిన మొత్తానికి బీమా సంస్థల నుంచి పరిహారం రాదు.
సరైన పత్రాలు సమర్పించకపోవడం: బీమా క్లెయిం తిరస్కరణకు ఇది మరొక సాధారణ కారణం. చాలావరకూ బిల్లులను తిరిగి చెల్లించాలని (రీయింబర్స్మెంట్) కోరే క్లెయింలలో కనిపిస్తుంది. క్లెయింను పూర్తిగా పరిశీలించి, పరిహారం ఇచ్చేందుకు పాలసీదారులు అవసరమైన అన్ని పత్రాలనూ సమర్పించాలి. ఆసుపత్రి నుంచి అవసరమైన పత్రాలు, బిల్లులు, ఆరోగ్య నివేదికలు తీసుకొని, వాటిని క్లెయింకు జత చేయాలి. ఈ తప్పనిసరి పత్రాలు సమర్పించకపోతే, క్లెయిం తిరస్కరిస్తాయి. అదనపు సమాచారం అవసరమైనప్పుడు బీమా సంస్థలు పాలసీదారులకు ఆ మేరకు సమాచారం ఇస్తాయి.
మోసపూరిత క్లెయింల సందర్భంలో: పాలసీదారులు లేదా ఆసుపత్రులు కొన్నిసార్లు మోసపూరిత క్లెయింలను దాఖలు చేస్తుంటారు. వాస్తవ క్లెయిం ఖర్చులు చెప్పకుండా, కాస్త అధికంగా బిల్లులు వేయడం, ఔట్ పేషెంట్ చికిత్సలకు బదులు ఆసుపత్రిలో చేరడం, ముందస్తు వ్యాధులను దాచి పెట్టి, చికిత్స చేయించుకోవడంలాంటివి ఉంటాయి. వీటిని బీమా సంస్థ గుర్తిస్తే, పరిహారంలో కోత విధించడం లేదా పూర్తిగా తిరస్కరించడం చేయొచ్చు. కొన్నిసార్లు ఆసుపత్రిలో చేరకుండానే బిల్లులు సృష్టించి, క్లెయిం చేయడం వంటివి చేస్తుంటారు. వీటిని తీవ్ర మోసాలుగా పరిగణిస్తారు. ఇలాంటప్పుడు బీమా సంస్థ పాలసీని రద్దు చేయడంలాంటి చర్యలు తీసుకుంటుంది.
క్లెయింను తిరస్కరించినప్పుడు ఆ వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత బీమా సంస్థకు ఉంటుంది. ఈ విషయంలో నియంత్రణ సంస్థ ఆదేశాలను బీమా సంస్థలు తప్పనిసరిగా పాటించాలి.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
- ముందుగా బీమా పాలసీలో ఉన్న అన్ని షరతులనూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. భవిష్యత్తులో క్లెయిం తిరస్కరణకు దారితీసే సందర్భాల గురించి తెలుసుకోవాలి. పాలసీ కొనుగోలు చేసేప్పుడు అన్ని వివరాలనూ స్పష్టంగా తెలియజేయడం ఎంతో అవసరం.
- పాలసీదారులు తప్పనిసరిగా బీమా సంస్థ మార్గదర్శకాలను అనుసరించాలి. పాలసీ పత్రంలో పేర్కొన్న శాశ్వత మినహాయింపులు, ఉప-పరిమితులను ప్రత్యేకంగా గమనించండి. నిర్ణీత వ్యాధులకు ఉన్న తప్పనిసరి నిరీక్షణ వ్యవధిని చూసుకోండి. వీలైనంత వరకూ తక్కువ నిరీక్షణ వ్యవధి ఉన్న పాలసీలను ఎంచుకునేందుకు ప్రయత్నించాలి.
- సాధ్యమైనంత వరకూ బీమా సంస్థతో ఒప్పందం ఉన్న ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకోవడమే మంచిది. దీనివల్ల మీరు చేతి నుంచి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, నగదు రహిత చికిత్సను అందుకునే వీలుంటుంది. బీమా సంస్థలు సాధారణంగా అన్ని పేరున్న ఆసుపత్రులతో కలిసి పనిచేస్తుంటాయి. కాబట్టి, మీకు ఇబ్బందేమీ ఉండదు. కొన్నిసార్లు మీరు చికిత్స కోసం వెళ్లిన ఆసుపత్రిని బీమా సంస్థ నిషేధిత జాబితాలో పెట్టొచ్చు. ఇలాంటప్పుడు పరిహారం ఇవ్వదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలను తెలుసుకోవాలి. బీమా సంస్థల వెబ్సైట్లను అప్పుడప్పుడూ పరిశీలిస్తుండాలి.
- ఎలాంటి సందేహాలున్నా బీమా సంస్థ సహాయ కేంద్రాన్ని సంప్రదించి, నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం బీమా సంస్థలు పాలసీదారులకు అవసరమైన ఆసుపత్రులను ఎంపిక చేసుకోవడంతోపాటు, ఇతర అంశాలపైనా సహాయం చేస్తున్నాయని గుర్తుంచుకోండి.
- బిల్లుల విషయంలో వాస్తవమైన చెల్లింపులే ఉండేలా చూసుకోవాలి. అధిక మొత్తానికి బిల్లులు వేస్తే, బీమా సంస్థ వాటిని చెల్లించకపోవచ్చు. ఇలాంటప్పుడు పాలసీదారులు చేతి నుంచి ఆ మొత్తాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సనత్ కుమార్, చీఫ్ క్లెయిమ్స్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..