Aadhaar card: ఆధార్కార్డ్పై పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
Aadhaar card Update: ఆధార్ కార్డుపై మీ వివరాలు తప్పుగా ఉన్నాయా? వాటిని సవరించాలనుకుంటున్నారా? మరి ఎన్నిసార్లు సవరించాలనే దానిపై పరిమితులున్నాయని తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డ్ ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ నుంచి బ్యాంకులు, కాలేజీలు, రేషన్ షాపులు ఇలా ప్రతిదగ్గర ఆధార్ కార్డ్ (Aadhaar card) అవసరం పడుతోంది. ముఖ్యంగా అధికారిక గుర్తింపు కార్డుగా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుపై ఉండే వివరాలు తప్పుల్లేకుండా ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ పొరపాటున ఏమైనా తప్పులున్నా.. సరిచేయించుకుంటే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అయితే, 2019లో యూఐడీఏఐ (UIDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు (Aadhaar card)పై ఉండే వివరాలను సవరించడంపై పరిమితి విధించింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను పరిమిత సంఖ్యలో మాత్రమే మార్చడానికి వీలు కల్పించింది.
పేరు: యూఐడీఏఐ కార్యాలయం మెమోరాండం ప్రకారం.. ఆధార్కార్డు (Aadhaar card)పై పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.
పుట్టిన తేదీ: పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి యూఐడీఏఐ అనుమతిస్తోంది. అదీ ఆధార్ తొలిసారి తీసుకున్న సమయంలో ఉన్న తేదీకి మూడు సంవత్సరాలు అటూఇటూ మాత్రమే మార్చాలి. ఆధార్ (Aadhaar card) నమోదు సమయంలో పుట్టిన తేదీకి సంబంధించి ఎలాంటి పత్రాలు రుజువుగా సమర్పించనట్లయితే.. దాన్ని ‘డిక్లేర్డ్’ లేదా ‘అప్రాగ్జిమేట్’గా పేర్కొంటారు. తర్వాత ఎప్పుడైనా మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా ఒక ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. అయితే, డిక్లేర్డ్ లేదా అప్రాగ్జిమేట్గా నమోదై ఉన్నవారికి మాత్రం మూడు సంవత్సరాలు అటూఇటూ నిబంధన వర్తించదు.
జెండర్: ఆధార్ కార్డులో జెండర్ వివరాలు కేవలం ఒకసారి మాత్రమే మార్చడానికి వీలుంటుంది.
ఫొటో: ఆధార్ కార్డ్ (Aadhaar card)పై ఉండే ఫొటోను సవరించుకోవడంపై మాత్రం ఎలాంటి పరిమితి లేదు. దగ్గర్లో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫొటోను అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మార్చడం సాధ్యం కాదు.
చిరునామా: అడ్రస్ను మార్చుకోవడంపై కూడా యూఐడీఏఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే, చిరునామాను ధ్రువీకరిస్తూ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
పరిమితికి మించి చేయాలంటే..
పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చడానికి వీల్లేదు. ఒకవేళ పరిమితి దాటిన తర్వాత మార్పులు చేయాలనుకుంటే మాత్రం ప్రత్యేక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్హోల్డర్ దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. పరిమితి మంచి సవరణలు చేస్తున్న నేపథ్యంలో అప్డేట్ను స్వీకరించమని ప్రత్యేకంగా మెయిల్ లేదా పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకు మార్చాల్సి వస్తుందో స్పష్టంగా వివరించాలి. దీనికి ఆధార్ (Aadhaar card) వివరాలు, సంబంధిత పత్రాలు, యూఆర్ఎన్ స్లిప్ను జత చేయాలి. help@uidai.gov.in మెయిల్ ఐడీకి మెయిల్ పంపాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా కోరితే తప్ప ప్రాంతీయ ఆధార్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సంప్రదించాల్సిన అవసరం లేదు. సంబంధిత అధికారులు విజ్ఞప్తిని క్షుణ్నంగా పరిశీలించి మార్పు సమంజసమేనని భావిస్తే.. అందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు అనుమతి ఇస్తారు. ఈ మేరకు చేయాల్సిన మార్పులకు సంబంధించిన వివరాలను టెక్నికల్ విభాగానికి పంపిస్తారు. కొన్ని రోజుల్లోనే మారిన వివరాలతో కొత్త ఆధార్ కార్డు మీ ఇంటికి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు