Irctc Tirupati: తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి..
IRCTC | ఇంటర్నెట్డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో పదోతరగతి ఎగ్జామ్స్ కూడా పూర్తవనున్నాయి. సాధారణంగా వేసవి సెలవుల్లో చాలామంది కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇప్పటికే కొందరు టికెట్లు బుక్ చేసుకొని ఉంటారు. మరికొందరు టికెట్లు దొరక్క ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి వారికోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైలు, విమాన ప్యాకేజీలను అందిస్తోంది. దర్శన టికెట్ల కోసం చింతించకుండా ఎంచక్కా వెంకటేశ్వరుడిని దర్శించుకొనే అవకాశం కల్పిస్తోంది.
తిరుమల వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్లీపర్) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి. ఏసీ గదిలో బస, రవాణా సదుపాయం ఉంటుంది. ప్యాకేజీని బట్టి టిఫిన్, భోజన సదుపాయం ఉంటుంది. ప్రయాణంలో ఏపీటీడీసీ గైడ్ మీకు సహకరిస్తారు. ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది. టోల్, పార్కింగ్ ఛార్జీలు ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది. విమాన ప్రయాణానికి కూడా ప్యాకేజీలో పేర్కొన్న సదుపాయాలే ఉంటాయి. పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం వాటిని భక్తులు చెల్లించాలి. తిరుమల్లో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నుంచి ఉన్న ప్యాకేజీలు
రైలు మార్గం ద్వారా తిరుపతికి చేరుకోవడానికి గోవిందం ‘GOVINDAM’ పేరుతో ఐఆర్సీటీసీ ఓ ప్యాకేజీని అందిస్తోంది. రెండు రాత్రులు, మూడు పగళ్లు ప్రయాణం కొనసాగుతుంది. ప్రతి రోజూ ఈ రైలు (ట్రైన్ నం.12734) అందుబాటులో ఉంటుంది. గుంటూరు, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ట్రిప్ పూర్తయ్యాక ఆయా స్టేషన్లలో దిగే సదుపాయం ఉంటుంది. ఏప్రిల్ 5 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.3,800 నుంచి టికెట్ ధరలు ప్రారంభం అవుతాయి. మరింత సమాచారం కోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ను సంప్రదించండి.
తిరుమలతో పాటు: పూర్వ సంధ్య (POORVA SANDHYA) పేరుతో ఐఆర్సీటీసీ మరో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూరు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ప్రయాణం కొనసాగుతుంది. రోజూ ఈ రైలు (ట్రైన్ నం. 12734) అందుబాటులో ఉంటుంది. గుంటూరు, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ఏప్రిల్ 5 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ధరలు రూ.5,660 నుంచి ప్రారంభం అవుతాయి. మరింత సమాచారం కోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ను సంప్రదించండి.
ఎయిర్ ప్యాకేజ్ కూడా..
రెండ్రోజుల్లోనే శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేలా ఐఆర్సీటీసీ ‘తిరుపతి బాలాజీ దర్శనం’ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 6E-2005 విమానంలో ప్రయాణిస్తారు. తిరుమల దర్శనం తర్వాత బస్సు మార్గంలో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు ఆలయాల దర్శనం ఉంటుంది. ఏప్రిల్ 11, 18, 25, 29 తేదీల ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రూ.15వేల నుంచి టికెట్ ధరలు ప్రారంభం అవుతాయి. మరింత సమాచారం కోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ను సంప్రదించండి.
విజయవాడ నుంచి
విజయ గోవిందం (VIJAY GOVINDAM) పేరుతో రెండు రాత్రులు, నాలుగు పగళ్లు ప్రయాణంతో ఐఆర్సీటీసీ శ్రీనివాసుని దర్శన ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఏప్రిల్ 12 నుంచి ప్రతీ శుక్రవారం శేషాద్రి ఎక్స్ప్రెస్ (ట్రైన్ నం- 17210) రైలు అందుబాటులో ఉంటుంది. విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, సామర్లకోట, తెనాలి స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. రూ.3,800 నుంచి టికెట్ ధరలు ప్రారంభం. మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ను పరిశీలించండి.
ఏడుకొండల స్వామిని దర్శించుకొనేందుకు సప్తగిరి (SAPTHAGIRI) పేరుతో విజయవాడ నుంచి మరో ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఏప్రిల్ 11 నుంచి ప్రతీ మంగళవారం (ట్రైన్ నెం: 12762) రైలు అందుబాటులో ఉంటుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు యాత్ర సాగుతుంది. రూ.5,600 నుంచి టికెట్ ధరలు ఉంటాయి. విజయవాడతో పాటు జమ్మికుంట, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది. కాబట్టి ఆయా ప్రాంత వాసులు ఈ ప్యాకేజీ వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సంప్రదించండి.
గమనిక: అందుబాటులో ఉన్న ప్యాకేజీ వివరాలను తెలియజేశాం. మీ ప్రయాణ తేదీలకు అనుగుణంగా టికెట్లు లభ్యతను ప్రయాణికులే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు