EPFO: యూఏఎన్ నంబరు గుర్తులేదా? ఇలా తెలుసుకోవచ్చు..
ఈపీఎఫ్ఓ సభ్యులు యూఏఎన్ నంబరును ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు
ఇంటర్నెట్ డెస్క్: ఈపీఎఫ్ (EPF) ఖాతాదారులకు యూఏఎన్ నంబరు (UAN Number) కీలకమైనది. ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ సభ్యులకు కేటాయించే 12 అంకెల సంఖ్య. దీని ద్వారా సభ్యులు ఆన్లైన్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాకు సులభంగా లాగిన్ అయ్యి.. పీఎఫ్ బ్యాలెన్స్ను తెలుసుకోవచ్చు. పాస్బుక్ను డౌన్లోడ్/ ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే, యూఏఎన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా వ్యక్తిగత వివరాలను, కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. రెండు ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేసుకోవచ్చు. అలాగే, ఆన్లైన్ ద్వారానే క్లెయింలు చేసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలను అందించే యూఏఎన్ నంబరు మీ వద్ద లేకపోతే తిరిగి పొందవచ్చు. అయితే, యూఏఎన్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. అలాగే, మొబైల్ నంబరుతో అనుసంధానమై ఉండాలి.
ఆన్లైన్ ద్వారా..
- ఈపీఎఫ్ఓ సభ్యుడు epfindia.gov.in పోర్టల్ను సందర్శించడం ద్వారా యూఏఎన్ను సులభంగా తెలుసుకోవచ్చు.
- ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ‘సర్వీసెస్’ సెక్షన్కు వెళ్లాలి.
- ఇక్కడ ‘ఫర్ ఎంప్లాయీస్’ పై క్లిక్ చేసి ‘యూఏఎన్ సభ్యుడు/ఆన్లైన్ సర్వీసెస్ (OCS/OTCP)’ పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు unifiedportal-mem.epfindia.gov.in పోర్టల్కు రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ‘ఇంపార్టెంట్ లింక్స్’లో అందుబాటులో ఉన్న ‘నో యువర్ యూఏఎన్’ పై క్లిక్ చేయాలి. లేదా ఇక్కడ ఉన్న లింక్పై క్లిక్ చేసి నేరుగా ఈ పేజీకి వెళ్లొచ్చు.
- ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ యూఏఎన్ నంబర్కు లింక్ అయ్యి ఉన్న మొబైల్ నంబరుకు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే మీ యూఏఎన్ నంబర్ ఎస్సెమ్మెస్ ద్వారా వస్తుంది.
ఆఫ్లైన్ ద్వారా
ఎస్ఎంఎస్: యూఏఎన్ యాక్టివ్గా ఉన్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 77382 99899కు ఎస్సెమ్మెస్ పంపడం ద్వారా యూఏఎన్ నంబరు, ఖాతా బ్యాలెన్స్ వంటి వివరాలను పొందొచ్చు. ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంగ్లంలో ఎస్సెమ్మెస్ పొందేందుకు EPFOHO UAN అనిటైప్ చేసి 77382 99899కి ఎస్సెమ్మెస్ చేయాలి. ఒకవేళ ప్రాంతీయ భాషల్లో పొందాలంటే ఆ భాషకు సంబంధించి తొలి మూడు అక్షరాలు కూడా టైప్ చేయాలి. ఉదాహరణకు తెలుగులో వివరాలు పొందాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి 77382 99899కు ఎస్సెమ్మెస్ చేయాలి. ఇలా ఎస్ఎంఎస్ పంపితే.. ఈపీఎఫ్ఓ చివరి కాంట్రీబ్యూషన్తో పాటు బ్యాలెన్స్, యూఏఎన్ నంబరు, పీఎఫ్ బ్యాలెన్స్ వంటి వివరాలతో ఈపీఎఫ్ఓ నుంచి ఎస్సెమ్మెస్ వస్తుంది.
మిస్డ్ కాల్: ఈపీఎఫ్ఓ సభ్యులు తమ రిజిస్టర్ మొబైల్ నంబరు నుంచి 99660 44425 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈ వివరాలు పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ