ఆ అకౌంట్లపై మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలొద్దు.. బ్యాంకులకు RBI ఆదేశం

RBI on minimum balance charges: రెండేళ్లకు పైగా వాడుకలో లేని ఖాతాలపై మినిమమ్‌ బ్యాలెన్స్‌ నిర్వహించలేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

Updated : 06 Jan 2024 18:25 IST

RBI | దిల్లీ: బ్యాంకు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండేళ్లలో ఎలాంటి లావాదేవీలూ జరపని ఖాతాల విషయంలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు స్పష్టంచేసింది. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు రెండేళ్లకు మించి వాడుకలో లేనప్పటికీ.. వాటిని నిరుపయోగంగా లేని ఖాతాలుగా గుర్తించకూడదని సూచించింది.

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను తగ్గించడంలో భాగంగా ఇటీవల ఆర్‌బీఐ ఈ సర్క్యులర్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. వాడుకలో లేని ఖాతాలు నిరుపయోగంగా మారుతున్నాయన్న విషయాన్ని బ్యాంకులు ఎస్సెమ్మెస్‌, లెటర్‌, లేదా ఇ-మెయిల్‌ రూపంలో ఖాతాదారులకు తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారులు అందుబాటులో లేని పక్షంలో నామినీకి ఆ సమాచారాన్ని చేరవేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ వెల్లడించింది.

ICICI క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో కోత.. ఇకపై వారికి మాత్రమే లాంజ్‌ యాక్సెస్‌!

ఆర్‌బీఐ తాజా నివేదిక ప్రకారం.. బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరుగుతున్నాయి. 2023 మార్చి నాటికి ఈ తరహా డిపాజిట్లు రూ.42,272 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.32,934 కోట్లుగా ఉంది. అంటే 28 శాతం మేర అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు పెరిగాయి.  క్లెయిమ్‌ చేసుకోకుండా ఉన్న ఈ తరహా డిపాజిట్లను వారసులు లేదా హక్కుదార్లు గుర్తించేందుకు వీలుగా UDGAM పేరిట ఓ కేంద్రీకృత వెబ్‌ పోర్టల్‌ను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఏదైనా ఖాతాలో డిపాజిట్‌ అన్‌క్లెయిమ్డ్‌గా ఉంటేనే దానిని ‘డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌’ ఫండ్‌ పథకానికి బదిలీ చేయాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని