పేటీఎం ఫాస్టాగ్లు ఏం చేయాలి? సౌండ్ బాక్స్ల మాటేంటి? RBI సమాధానాలివే..!
RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది.
Paytm Payments Bank | ఇంటర్నెట్ డెస్క్: పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank), వాలెట్లతో పాటు క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్స్ల గురించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది ఆర్బీఐ. వినియోగదారుల నుంచి తరచూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అలాగే, గతంలో ఫిబ్రవరి 29గా నిర్దేశించిన గడువును.. మార్చి 15 వరకు పొడిగించింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మరో 15 రోజులు గడువు
ఆర్బీఐ FAQ
- నగదు విత్డ్రా: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును 2024 మార్చి 15 తర్వాత కూడా ఖాతా ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. అలాగే, పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన డెబిట్ కార్డు ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. 15 తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేయలేరు. వడ్డీ, క్యాష్బ్యాక్స్, పార్ట్నర్ బ్యాంక్స్ నుంచి స్వీప్-ఇన్, రిఫండ్లు మాత్రమే అనుమతిస్తారు.
- వేతన ఖాతా: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉంటే మార్చి 15 తర్వాత నగదును అందుకోలేరు. భవిష్యత్లో ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
- సబ్సిడీ: ప్రభుత్వం నుంచి ఆధార్తో అనుసంధానం అయి ఉన్న నగదు బదిలీ గానీ, సబ్సిడీ గానీ వస్తుంటే అలాంటివారు కూడా నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
- ఆటో డెబిట్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో నగదు ఉన్నంతవరకు ఆటో డెబిట్ (NACH)కు అవకాశం ఉంటుంది. మార్చి 15 తర్వాత నగదు పూర్తయితే ఆటో డెబిట్కు అవకాశం ఉండదు. కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.
- ఓటీటీ సబ్స్క్రిప్షన్: పేటీఎం పేమెంట్ బ్యాంక్స్తో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే మార్చి 15 తర్వాత ఖాతాలో ఉన్న నగదు పూర్తయ్యేంత వరకు మాత్రమే రెన్యువల్కు అవకాశం ఉంటుంది.
- వాలెట్: మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాష్బ్యాక్, రిఫండ్లు మినహా ఇతరుల నుంచి కూడా నగదును పొందలేరు. కావాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ క్లోజ్ చేసి ఆ నగదును ఇతర బ్యాంకులకు పంపించుకోవచ్చు.
- ఫాస్టాగ్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్లను మార్చి 15 తర్వాత అందులో బ్యాలెన్స్ ఉండేంత వరకు వినియోగించుకోవచ్చు. ఆపై రీఛార్జి చేయడం కుదరదు. కాబట్టి వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. ఫాస్టాగ్లో నగదును బదిలీ చేయడం కుదరదు. కొత్త ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. లేదంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను సంప్రదించి రిఫండ్ కోరొచ్చు.
- NCMC: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన నేషనల్ కామన్ మొబిలీ కార్డుదారులు (NCMC) సైతం మార్చి 15 తర్వాత అందులోని బ్యాలెన్స్ పూర్తయ్యే వరకు వినియోగించుకోవచ్చు. భవిష్యత్లో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఇతర బ్యాంకులు జారీ చేసే ఈ తరహా కార్డులను తీసుకోవచ్చు. ఇందులోని నగదును కూడా వేరే కార్డుకు బదిలీ చేయడం కుదరదు. కావాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను రిఫండ్ కోరొచ్చు.
- UPI: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు అనుసంధానం అయిఉన్న యూపీఐ/IMPS ఖాతాలకు మార్చి 15 తర్వాత నగదు పంపలేరు. ఆ సమయంలో అందులో ఉన్న నగదును యూపీఐ/IMPS ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు.
- క్యూఆర్ కోడ్లు, పేటీఎం సౌండ్ బాక్స్లు: పేటీఎం క్యూఆర్ కోడ్లు, పేటీఎం సౌండ్ బాక్స్లు లేదా పీఓఎస్ టర్మినల్స్ వినియోగిస్తున్న మర్చంట్స్.. ఇతర బ్యాంకులతో అనుసంధానం అయి ఉంటే వాటిని మార్చి 15 తర్వాత కూడా యథాతథంగా వినియోగించుకోవచ్చు. ఒకవేళ వాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనుసంధానం అయ్యి ఉంటే.. అందులో ఎలాంటి నిధులూ జమ కావు. కాబట్టి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ ఖాతాను వాటికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 15 తర్వాత కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న ఫండ్స్ను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కు మళ్లించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.