కరోనా బాధితుల ఇంట్లో చోరీ

కరోనా బాధితుల ఇంట్లో దొంగలు చెలరేగిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి......

Published : 12 Aug 2020 02:10 IST

గుంతకల్లు: కరోనా బాధితుల ఇంట్లో దొంగలు చెలరేగిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డారు. గుంతకల్లులో కరోనా బారిన కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఇంట్లోకి దొంగలు చొరబడి రూ.3లక్షలు నగదు, 8తులాల బంగారం ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్‌ రాగా.. చికిత్స పొందుతూ కుటుంబ పెద్ద సుబ్రహ్మణ్యం మృతిచెందారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని