శ్రీకాళహస్తి విగ్రహాల ప్రతిష్ఠ నిందితులు అరెస్ట్
శ్రీకాళహస్తి ఆలయంలో రాతి శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించిన ముగ్గురు వ్యక్తులను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు ముగ్గురు అన్నదమ్ములు
తిరుపతి (నేరవిభాగం): శ్రీకాళహస్తి ఆలయంలో రాతి శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్ఠించిన ముగ్గురు వ్యక్తులను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు ముగ్గురు అన్నదమ్ములు ఆ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసు వివరాలను అర్బన్ ఎస్పీ రమేశ్రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాల ద్వారా ఛేదించినట్లు ఆయన చెప్పారు. సుమారు 100 సీసీ టీవీ కెమెరాల విజువల్స్ను పరిశీలించి నిందితులను గుర్తించామన్నారు. నిందితులను చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు పిండి శూలవర్ధన్(32), పిండి తిరుమలయ్య (30), పిండి మునిశేఖర్(28)గా గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు.
తిరుమలయ్య, మునిశేఖర్ చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. 30 ఏళ్లు దాటినా వివాహం కాకపోవడం, ఆర్థిక సమస్యలు అధిగమించడానికి జ్యోతిష్యుల సూచన మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠకు నిర్ణయించారు. ఈ క్రమంలో ఈనెల ఆరో తేదీన ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రమేశ్ రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.