Bapatla: బాపట్ల జిల్లాలో పడవ బోల్తా.. ముగ్గురి గల్లంతు

బాపట్ల జిల్లాలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. నిజాంపట్నం హార్బర్‌ ముఖద్వారం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Published : 20 Aug 2023 20:04 IST

నిజాంపట్నం: బాపట్ల జిల్లాలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. నిజాంపట్నం హార్బర్‌ ముఖద్వారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా.. కెరటాల ఉద్ధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లి సాయివర్ణిక (25) సహా ఇద్దరు చిన్నారులు తనీష్‌ (7), తరుణేశ్వర్‌ (1) గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని