Hyd News: నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

శంషాబాద్‌ పరిధిలో నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 19 Mar 2024 14:07 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ పరిధిలో నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీబాలాజీ ఇండస్ట్రీపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. హానికర రసాయనాలు, సింథటిక్‌ రంగులతో సాస్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 772 లీటర్ల కల్తీ సాస్‌, 30 లీటర్ల ఎసిటిక్‌ ఆసిడ్‌, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ సాస్‌ విలువ రూ.3.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని