Kavali: అప్పుల బాధతో బిర్యానీలో విషం కలిపి తిన్న కుటుంబం

అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కావలిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 02 Jan 2024 12:33 IST

కావలి: అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న భాస్కర్‌ అనే వ్యక్తి తన భార్య, కుమార్తె, కుమారుడికి బిర్యానీలో విషం కలిపి తినిపించాడు. అనంతరం తానూ తిన్నాడు. ఇంట్లోని వారంతా వాంతులు చేసుకోవడంతో గుర్తించిన స్థానికులు.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని