KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?
హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం లఖ్నవూ కెప్టెన్పై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. అంతకుముందు కోల్కతా చేతిలో ఘోర ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్కు (KL Rahul) సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి తర్వాత లఖ్నవూ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా సారథి కేఎల్కు చీవాట్లు పెట్టినట్లు ఉన్న వీడియోలు కూడా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు ఆడే చివరి రెండు మ్యాచులకు రాహుల్ కెప్టెన్గా వ్యవహరించకపోవచ్చని తెలుస్తోంది. ‘‘లఖ్నవూ తన తదుపరి మ్యాచ్ను మే 14న ఆడనుంది. దాదాపు వారం రోజుల వ్యవధి. దిల్లీతో తలపడనుంది. తన బ్యాటింగ్పై ఏకాగ్రత కోసం కెప్టెన్సీని వదిలేస్తాడని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిస్తేనే లఖ్నవూకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే మేనేజ్మెంట్ ఎలాంటి ఆలోచన చేస్తుందో తెలియదు’’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కేవలం రెండు మ్యాచ్లతో ఆగిపోడని.. ఫ్రాంచైజీకే గుడ్బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి.
వచ్చే మెగా వేలానికి ముందు రిటైన్ కూడా కష్టమే!
ఐపీఎల్లోకి లఖ్నవూ సూపర్ జెయింట్స్ అడుగుపెట్టినప్పటినుంచి కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2022, 2023 సీజన్లలో ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. ఈసారి కూడా ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆ జట్టు తడబాటుకు గురవుతోంది. గత రెండు మ్యాచుల్లో భారీ ఓటమితో ఆ జట్టు కుదేలైంది. ఇక మిగిలిన మ్యాచుల్లోనూ గెలిచినా.. ప్లేఆఫ్స్కు వెళ్తామనే గ్యారంటీ లేదు. దీంతో వచ్చే సీజన్ కోసం కొత్త సారథిని ఎంచుకొనే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2025లో జరగనున్న మెగా వేలానికి ముందు.. రిటైన్ చేసుకునే ప్రక్రియలో భాగంగా లఖ్నవూ అతడిని అట్టిపెట్టుకొనే అవకాశాలు చాలా తక్కువని వార్తలు వస్తున్నాయి. రెండేళ్ల కిందట రూ. 17 కోట్లు వెచ్చించి కేఎల్ రాహుల్ను తీసుకుంది. ఇప్పుడు ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ఇలా కెమెరాల ముందే సీరియస్గా మాట్లాడటంతో కేఎల్ రాహులే స్వయంగా జట్టును వీడే ఛాన్స్ ఉందనేది కొందరి వాదన. అసలు వారేం మాట్లాడుకున్నారో బయటకు వస్తే కానీ.. ఈ అనుమానాలకు తెరపడదు.
బ్యాటర్గా తిరుగులేదు.. కానీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేఎల్ రాహుల్ 12 మ్యాచుల్లో 460 పరుగులు చేశాడు. కానీ, స్ట్రైక్రేట్ తక్కువగా ఉందనే విమర్శలూ ఉన్నాయి. పవర్ ప్లేలో దూకుడుగా ఉండాల్సిన సమయంలోనూ నెమ్మదిగా ఆడతాడనే కామెంట్లూ వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ 33 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉన్నాయి. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయినప్పుడు ఇలా ఆడటం ఓకే కానీ.. టీ20 ఫార్మాట్కు ఇది సరిపోదనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు పొట్టి ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టులోనూ అతడికి స్థానం దక్కలేదు. ఆ ప్రభావం కూడా కెప్టెన్సీపై పడి ఉంటుందని క్రీడా పండితులు చెబుతున్నమాట. అయితే, కేవలం ఒక్క మ్యాచ్తోనే కేఎల్ నాయకత్వంపై విమర్శలు చేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. తదుపరి రెండు మ్యాచుల్లోనూ గెలిపించి ప్లేఆఫ్స్కు తీసుకెళ్తాడని కేఎల్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన