Vizianagaram: కొత్తవలసలో విషాదం.. బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

Updated : 12 Sep 2023 09:28 IST

భార్యాభర్తలు, కుమార్తె మృతి

కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కుమార్తె మృతిచెందారు.

ఎం.డి. మొహినుద్దీన్‌ (46) తన కుటుంబంతో కలిసి విశాఖ నగరం మర్రిపాలెం పరిధిలోని ఎఫ్‌సీఐ నగర్‌లో నివాసముంటున్నారు. సోమవారం సాయంత్రం భార్య సంషినిషా (39), కుమార్తె ఫాతిమా జహీదా (17), కుమారుడు అలీతో కలిసి కొత్తవలస సమీపంలోని చింతపాలెంలో తమ స్థలం చూసేందుకు వెళ్లారు. అనంతరం అక్కడే బావిలో దూకారు.

ఈ ఘటనలో మొహినుద్దీన్‌, అతడి భార్య, కుమార్తె చనిపోగా.. కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. కొత్తవలస పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబం బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటనే విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని