Telangana News: జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం: రూ.25 కోట్ల నష్టం

పెద్దపల్లి మండల పరిధి రాఘవాపూర్‌ గ్రామ శివారులోని శ్రీరామ జిన్నింగ్‌మిల్లులో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Published : 06 Feb 2022 17:49 IST

పెద్దపల్లి: పెద్దపల్లి మండల పరిధి రాఘవాపూర్‌ గ్రామ శివారులోని శ్రీరామ జిన్నింగ్‌మిల్లులో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మిల్లులో నిల్వ చేసిన పత్తి బేళ్లు భారీగా దగ్ధమయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు పెద్దపల్లి, గోదావరిఖని, మంథనికి చెందిన అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించారు. మిల్లులోకి పత్తి దిగుమతి చేసేందుకు వచ్చిన ఓ డీసీఎం వ్యాన్‌ నుంచి మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.25కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని