crime news: కృష్ణా జిల్లాలో విషాదం.. చెరువులో పడి నలుగురు చిన్నారుల మృతి

కృష్ణా జిల్లాలో కైకలూరు మండలం వరాహపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడిన నలుగురు చిన్నారులు మృతి చెందారు.

Updated : 14 Oct 2021 18:14 IST

కైకలూరు: కృష్ణా జిల్లా కైకలూరు మండలం వరాహపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు చెరువులో పడిపోవటాన్ని గమనించిన స్థానికులు వారిని వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని