Andhra news: పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం.. నలుగురి మృతి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని లారస్ పరిశ్రమ యూనిట్-3లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్ యూనిట్ 3 కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. సంస్థలోని మ్యానుఫాక్చరింగ్ నంబర్ 6 బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్లో రియాక్టర్కు చెందిన డ్రైయర్ రూమ్ నుంచి కెమికల్ ప్లాస్ ఫైర్ అవ్వడంతో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని కీలలు రబ్బరు పరికరాలకు అంటుకొని గ్రౌండ్ ఫ్లోర్ అంతా మంటలు వ్యాపించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన కెమిస్ట్ బంగి రాంబాబు(32), గుంటూరుకు చెందిన ఎగ్జిక్యూటివ్ తలసిల రాజేశ్బాబు (36), అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన హెల్పర్ రాపేటి రామకృష్ణ, అనకాపల్లి జిల్లి చోడవరానికి చెందిన హెల్పర్ మజ్జి వెంకట్రావు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడ్ల సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్