ముఖానికి లైట్‌ వేశాడని.. కడతేర్చాడు..!

ముఖానికి టార్చి లైట్‌ వేశాడన్న కోపంతో ఎదుటి వ్యక్తిని కడతేర్చాడో యువకుడు. ఉత్తర ముంబయిలోని కురార్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 08 Mar 2020 18:45 IST

ముంబయి: ముఖానికి టార్చి లైట్‌ వేశాడన్న కోపంతో ఎదుటి వ్యక్తిని కడతేర్చాడో యువకుడు. ఉత్తర ముంబయిలోని కురార్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని కురార్‌ ప్రాంతానికి చెందిన అభిషేక్‌ చౌహాన్‌ అనే వ్యక్తి ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి వెళ్లాడు. టార్చి లైట్‌ వేసుకుని భవనం ఎక్కుతుండగా.. మెట్లపై అభిచంద్ర యాదవ్‌ అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఈ క్రమంలో మెట్లపై ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు చౌహాన్‌ అతడి ముఖానికి టార్చి లైట్‌ వేశాడు. దీంతో చౌహాన్‌పై ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ముఖానికి లైట్‌ వేస్తావా అంటూ చౌహాన్‌తో వాగ్వాదానికి దిగాడు. అది కాస్తా ముదరడంతో యాదవ్‌ నాలుగో అంతస్థు నుంచి ఆ వ్యక్తిని తోసేశాడు. దీంతో చౌహాన్‌ అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోలీసులు నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని