ఇరు వర్గాల మధ్య ఘర్షణ
అనంతపురం జిల్లా గుత్తి మండలం మార్నెపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కారంపొడి చల్లుకుంటూ పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 16 మంది గాయపడ్డారు
16 మందికి గాయాలు
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం మార్నెపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కారంపొడి చల్లుకుంటూ పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 16 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సుభాష్ (30) అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడాది ఓ అమ్మాయి పట్ల మరో వర్గం యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఆ నేపథ్యంలోనే ఇరు వర్గాల వారు దాడులకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఘర్షణల్లో గాయపడిన క్షతగ్రాతులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్