ఇరు వర్గాల మధ్య ఘర్షణ

అనంతపురం జిల్లా గుత్తి మండలం మార్నెపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కారంపొడి చల్లుకుంటూ పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 16 మంది గాయపడ్డారు

Published : 17 May 2020 23:27 IST

16 మందికి గాయాలు

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం మార్నెపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. కారంపొడి చల్లుకుంటూ పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 16 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సుభాష్‌ (30) అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడాది ఓ అమ్మాయి పట్ల మరో వర్గం యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఆ నేపథ్యంలోనే ఇరు వర్గాల వారు దాడులకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఘర్షణల్లో గాయపడిన క్షతగ్రాతులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని