తననే పెళ్లాడాలనిబెదిరించిన యువకుడి హత్య
తనను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోవద్దని యువతిని బెదిరిస్తున్న యువకుడిని హత్య చేసిన ఘటన నిజాంపేట మండలం రాంపూర్లో బుధవారం ఉదయం...
న్యూస్టుడే - రామాయంపేట, చేగుంట: తనను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోవద్దని యువతిని బెదిరిస్తున్న యువకుడిని హత్య చేసిన ఘటన నిజాంపేట మండలం రాంపూర్లో బుధవారం ఉదయం జరిగింది. ఎస్ఐ ప్రకాష్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన జల్ల నర్సింలుగౌడ్ (30) ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా అతనిపై కొందరు వ్యక్తులు కట్టెలు, రాళ్లతో దాడి చేశారు. గాయపడిన నర్సింలుగౌడ్ను రామాయంపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నర్సింలుగౌడ్ అదే గ్రామానికి చెందిన యువతిని గత కొన్నేళ్లుగా ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించాలంటూ, పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. గతేడాది నిజాంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం పద్దెనిమిదేళ్ల ఆ యువతికి తల్లిదండ్రులు వివాహం చేయాలని భావించి సంబంధాలు చూస్తున్నారు. యువతిని, తల్లిదండ్రులను తరచుగా బెదిరిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలంటే లేదంటే ఊరుకోనని భయాందోళనకు గురి చేశాడు. ప్రమాదకరంగా పరిణమించడంతో యువతి తండ్రి, బంధువులు, గ్రామస్థులు పలువురు యువకుడిని దారి కాచి కొట్టారు. అనంతరం నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్