నిప్పు అంటించుకున్న భార్యను వీడియో తీసిన భర్త

అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక నిప్పు అంటించుకుని మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడాల్సింది...

Updated : 27 Nov 2020 07:04 IST

జైపుర్‌: అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక నిప్పు అంటించుకుని మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడాల్సింది పోయి, ఆ దారుణాన్ని ఫోన్‌లో చిత్రీకరించి ఆమె కుటుంబ సభ్యులకు పంపిన ఓ రాక్షసుడి దురాగతమిది. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాకు చెందిన ఓ వివాహిత ఈ నెల 20న ఆత్మహత్య చేసుకోవడానికి నిప్పు అంటించుకుంది. ఒంటిని మంటలు దహించివేస్తుంటే బాధను ఓర్చుకోలేక కేకలు పెడుతున్నా అక్కడే ఉన్న భర్త కాపాడే ప్రయత్నం చేయలేదు సరికదా ఆ దృశ్యాన్ని ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత దాన్ని ఆమె తల్లిదండ్రులకు పంపాడు. పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న ఆమె జైపుర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 22న మరణించింది. దీనికి సంబంధించి ఆమె భర్త, అత్తమామలపై గురువారం కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని