Road Accident: లాస్‌ఏంజిల్స్‌లో భారతీయ బాలుడి మృతి

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో శనివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన శెట్టిపల్లి ఆర్జిత్‌రెడ్డి(15) మృతి చెందాడు. మృతుడి

Updated : 21 Dec 2021 09:15 IST


మృతి చెందిన ఆర్జిత్‌రెడ్డి

లింగాలఘనపురం(జఫర్‌గఢ్‌), న్యూస్‌టుడే: అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో శనివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన శెట్టిపల్లి ఆర్జిత్‌రెడ్డి(15) మృతి చెందాడు. మృతుడి బాబాయి రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడెంకు చెందిన రాంచంద్రారెడ్డి, రజని దంపతులు 20 ఏళ్ల క్రితం లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లారు. అక్కడ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరి కూతురు అక్షితారెడ్డి పదకొండో, కొడుకు ఆర్జిత్‌రెడ్డి పదో తరగతి చదువుతున్నారు. శనివారం మిత్రుడి ఇంట్లో విందు ఉండగా కుటుంబ సభ్యులతో వెళ్లారు. రాత్రి 11 గంటలకు తిరిగి వస్తుండగా.. ఓ మూలమలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆర్జిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్షితరెడ్డికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రాంచంద్రారెడ్డి, రజనిలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాంచంద్రారెడ్డి ఫోన్లో తన సోదరుడు బండ్లగూడెంలో ఉంటున్న రవీందర్‌రెడ్డికి చెప్పారు. రాంచంద్రరెడ్డి తన తండ్రి మృతి చెందితే 2016లో గ్రామానికి వచ్చారు. స్థానికంగా తల్లి, సోదరుడు ఉంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.

చికిత్స పొందుతున్న అక్షితారెడ్డి

బండ్లగూడెంలో రోదిస్తున్న బంధువులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని