భర్తతో విడిపోయేందుకు నిర్ణయం.. లుథియానా వ్యక్తితో స్నేహం.. అతను ద్రోహం
ఫేస్బుక్ పరిచయం.. ఓ మహిళను ప్రాణసంకటంలో పడేసింది.. ఇద్దరు పిల్లలున్న ఆమె, అభిప్రాయభేదాల కారణంగా భర్తతో విడిపోదామని నిర్ణయించుకుంది.. ఈ క్రమంలో ఫేస్బుక్లో పంజాబ్లోని లుథియానాకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఈనాడు, హైదరాబాద్: ఫేస్బుక్ పరిచయం.. ఓ మహిళను ప్రాణసంకటంలో పడేసింది.. ఇద్దరు పిల్లలున్న ఆమె, అభిప్రాయభేదాల కారణంగా భర్తతో విడిపోదామని నిర్ణయించుకుంది.. ఈ క్రమంలో ఫేస్బుక్లో పంజాబ్లోని లుథియానాకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను వ్యాపారం చేస్తున్నానని, నెలకు రూ.2లక్షలు ఆదాయం వస్తుందని చెప్పడంతో నమ్మింది.. అతన్ని హైదరాబాద్కు ఆహ్వానించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఒకసారి మీ ఇంటికి వస్తానంటూ ఆమె లుధియానా వెళ్లగా.. అతడు ఓ హత్య కేసులో ముద్దాయని తేలింది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిన ఆమెపై అతడికి ఆగ్రహం వచ్చింది.. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆమెకు పంపించాడు. పెళ్లిచేసుకుంటావా? చస్తావా? అంటూ బెదిరించాడు. దీంతో ఆమె ఇటీవల సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మనం పెళ్లిచేసుకుందాం...
సికింద్రాబాద్లో ఉంటున్న మహిళ(40)కు ఇరవై ఏళ్లక్రితం పెళ్లయ్యింది. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలనుకున్నారు. తొమ్మిది నెలలుగా విడిగా ఉంటున్నారు. కొత్తపరిచయాలు, వ్యాపార ఆలోచనల కోసం ఆమె తన ఫేస్బుక్ఖాతాను క్రియాశీలకంగా మార్చుకుంది. వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన యువతీయువకులను పరిచయం చేసుకుంది. లుథియానాకు చెందిన వ్యక్తి(38)తో పరిచయం ఏర్పడింది. తన ఆర్థిక పరిస్థితి బాగుందని, పెళ్లిచేసుకుందామంటూ అతడు చెప్పడంతో మహిళ అంగీకరించింది. రెణ్నెల్ల క్రితం అతడు హైదరాబాద్కు రాగా.. ఇద్దరూ కలిసి దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. స్వస్థలానికి వెళ్లేముందు తనకు రూ.లక్ష కావాలంటూ కోరగా.. ఆమె తన వద్ద రూ.60వేలే ఉన్నాయని ఇచ్చింది.. మీ ఊరికి వస్తానని అతనితో కలిసి వెళ్లింది.
నగ్నచిత్రాలు.. మార్ఫింగ్ వీడియోలతో బెదిరింపులు
లుథియానా నుంచి హైదరాబాద్కు వచ్చిన కొద్దిరోజులకే ఆ వ్యక్తి.. నగ్నచిత్రాలు, మార్ఫింగ్ వీడియోలను ఆమె చరవాణికి పంపించాడు. వాటిని స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకూ పంపుతానంటూ బెదిరించాడు. మహిళ లెక్కచేయకపోవడంతో వాటిని ఆమె స్నేహితులకు పంపించాడు. భయపడిన మహిళ ఏం కావాలంటూ అడగ్గా.. పెళ్లి చేసుకోవాలంటూ చెప్పాడు. తనకు ఇష్టంలేదని తిరస్కరించగా.. ఫొటోలు, వీడియోలను యూట్యూబ్లో ఉంచుతానంటూ హెచ్చరించాడు. దీంతో ఆమె సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె భర్త.. ఆమెను ఓదార్ఛి. పోలీస్ఠాణాకు తీసుకురావడం కొసమెరుపు.
అక్కడికి వెళ్తే తెలిసిన రహస్యం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.