Telangana News: కొలువు కల ఛిద్రమై.. శాశ్వతంగా దూరమై..
చెల్లె, తమ్ముడి చదువులకు అండగా.. తల్లిదండ్రులకు ఓ కొడుకులా కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంది ఆమె.. అందుకే తోటి స్నేహితురాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోతుంటే తనపైనే ఆధారపడిన కుటుంబం కోసం అవివాహితగానే ఉండిపోయింది. వారికి అన్నీ తానై వ్యవహరించింది
చెరువులో దూకి యువతి ఆత్మహత్య
చెల్లె, తమ్ముడి చదువులకు అండగా.. తల్లిదండ్రులకు ఓ కొడుకులా కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంది ఆమె.. అందుకే తోటి స్నేహితురాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోతుంటే తనపైనే ఆధారపడిన కుటుంబం కోసం అవివాహితగానే ఉండిపోయింది. వారికి అన్నీ తానై వ్యవహరించింది. ఉన్నత చదువు పూర్తి కాగానే ఉద్యోగంలో చేరింది. అంత అనుకున్నట్లుగానే సాగిపోతున్న తరుణంలో.. అర్హత పరీక్షలో ఉత్తీర్ణురాలు కాకపోవడం మనోవేదనకు గురి చేసింది. ఇప్పటికే కరోనాతో ఛిద్రమైన కుటుంబ ఆర్థిక పరిస్థితి. చాలీచాలని తాత్కాలిక ఉద్యోగ వేతనం.. తనపైనే ఆధారపడిన వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాననే బాధ. వెరసీ మూడు పదుల వయస్సులోనే చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడటంతో ఆ కుటుంబానికి ఆధారం, అండ లేకుండా పోయింది. హృదయ విదారకమైన ఈ ఘటన కాజీపేటలో శనివారం ఉదయం వెలుగు చూసింది.
కాజీపేట సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. వరంగల్లోని కాశీబుగ్గ ఇందిరాగాంధీ విగ్రహ ప్రాంతానికి చెందిన గుండు భాగ్యలక్ష్మి అశోక్ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిలో రమ్య(32) మూడో సంతానం.. ఎమ్మెస్సీ కెమెస్ట్రీ చదువుకున్నారు. రమ్య కంటే పెద్దవారైన ఇద్దరి పెళ్లిళ్లు జరిగాయి. తల్లి గృహిణి కాగా, తండ్రి గతంలో బంగారం దుకాణంలో పనిచేసేవారు. రమ్య జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో ల్యాబ్ అసిస్టెంట్ తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమయ్యారు. ఇక తనకు శాశ్వత ఉద్యోగం రాదేమోనని మనస్తాపంతో శుక్రవారం ఉదయం ఇంట్లోంచి వెళ్లింది శుక్రవారం యువతి కనిపించలేదని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాజీపేటలోని వడ్డేపల్లి చెరువులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాశీబుగ్గవాసులు కోరుతున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు.
- న్యూస్టుడే, కాజీపేట టౌన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.