Andhra News: ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెదచెరువు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Updated : 07 Feb 2023 11:05 IST

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: ఇద్దరు పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెదచెరువు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ విజయభాస్కరరావు కథనం ప్రకారం.. రొంపిచర్ల మండలం నలగార్లపాడుకు చెందిన శివలింగేశ్వరి(27)తో నరసరావుపేటకు చెందిన ఇంద్రసేనారెడ్డికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. అతను పట్టణంలోని గుంటూరు రోడ్డులో ట్రాక్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. వీరికి చరణ్‌సాయిరెడ్డి(8), జతిన్‌రెడ్డి(4) పిల్లలు ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రోజూ భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా కొట్టడంతో మనస్తాపం చెందిన ఆమె భర్త బయటకు వెళ్లగానే పిల్లలకు ఉరేసి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని