Kerala: స్నేహితుడి ప్రైవేటు భాగాల్లో కంప్రెషర్‌ పంపుతో గాలి కొట్టాడు

ఓ వలసకూలీ సరదా కోసం చేసిన పని స్నేహితుడి ప్రాణాలు తీసింది. అస్సాంకు చెందిన మింటూ, సిద్దార్థ్‌ పని కోసం కేరళకు వలస వచ్చారు.

Updated : 11 May 2023 10:39 IST

వలసకూలీ సరదా కోసం చేసిన పని స్నేహితుడి ప్రాణాలు తీసింది. అస్సాంకు చెందిన మింటూ, సిద్దార్థ్‌ పని కోసం కేరళకు వలస వచ్చారు. వీరిద్దరూ స్నేహితులు. సిద్దార్థ్‌ సరదాగా మింటూ ప్రైవేటు భాగాల్లోకి కంప్రెషర్‌ పంపుతో గాలి కొట్టాడు. దీంతో ఒక్కసారిగా మింటూ కడుపు ఉబ్బిపోయింది. భయపడిపోయిన సిద్దార్థ్‌.. మింటూను ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లు ధ్రువీకరించారు. తన స్నేహితుడు మింటూ హఠాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయాడని సిద్దార్థ్‌ వైద్యులకు చెప్పాడు. అనుమానించిన వైద్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు విచారణలో సిద్దార్థ్‌ తన నేరాన్ని అంగీకరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని