దైవదర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి
దైవదర్శనానికి బయలుదేరిన రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం అంతులేని విషాదం నెలకొంది. వారు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొనడంతో అయిదుగురు మృతి చెందారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న తుఫాన్ వాహనం
అయిదుగురి మృతి, 14 మందికి గాయాలు
రాయచూరు, న్యూస్టుడే: దైవదర్శనానికి బయలుదేరిన రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం అంతులేని విషాదం నెలకొంది. వారు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొనడంతో అయిదుగురు మృతి చెందారు. ఏపీలోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాలకు చెందిన రెండు కుటుంబాలు కర్ణాటకలోని కలబురగి ఖాజా బందేనవాజ్ దర్గాకు తుఫాన్ వాహనంలో సోమవారం సాయంత్రం వెలుగోడు నుంచి బయలుదేరాయి. మంగళవారం వేకువజామున కర్ణాటకలోని యాదగిరి జిల్లా సైదాపూరు సమీపంలోని 150వ జాతీయ రహదారిపై వెళ్తుండగా తుఫాన్ డ్రైవర్ ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టాడు. ఆ ధాటికి ఘటనా స్థలంలోనే మునీర్(40), నయామత్(40), ముద్దత్ శిర్ (12), రమీజాబేగం(50), సుమ్ని(12)లు మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన 14 మందిని రాయచూరులోని రిమ్స్కు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని బంధువులు కర్నూలు తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్