Vijayawada: ‘బాబాయ్ బాగున్నావా’ అంటూ రూ.80 వేలు టోకరా
బాబాయ్ బాగున్నావా అంటూ ఆప్యాయత ఒలకబోసి ఓ మోసగాడు రూ.80 వేలు కొట్టేశాడు.
పెనమలూరు, న్యూస్టుడే: బాబాయ్ బాగున్నావా అంటూ ఆప్యాయత ఒలకబోసి ఓ మోసగాడు రూ.80 వేలు కొట్టేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంటా రాజేశ్వరరావు కానూరు డీఎన్ఆర్ కాలనీ నివాసి. ఇతను రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
శనివారం సాయంత్రం స్థానిక నారాయణ పాఠశాల వద్ద ఉన్న సిమెంటు బెంచిపై కూర్చొని ఉండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ‘బాబాయ్ బాగున్నావా.. పిన్ని బాగుందా’ అంటూ పలకరించాడు. తాను బంధువునని, వృద్ధాప్యం కారణంగా నన్ను గుర్తుపట్టలేకపోతున్నావంటూ మాటామాటా కలిపాడు. నిజమని నమ్మిన రాజేశ్వరరావు ఇంటికి తీసుకెళ్లి భార్యకు పరిచయం చేసి కాఫీ ఇచ్చి మర్యాద చేశారు. తన కుమార్తెకు ఆదివారం ఆటోనగర్ గేటు వద్ద ఉన్న ఓ కల్యాణ మండపంలో ఓణీల ఫంక్షన్ నిర్వహిస్తున్నానని ఇద్దరూ వచ్చి ఆశీర్వదించాలని సదరు వ్యక్తి కోరాడు.
అనంతరం తన వద్ద రూ.80 వేల రూ.2 వేల నోట్లు ఉన్నాయని తనకు దీనికి సరిపడా రూ.500 నోట్లు ఇవ్వాలని కోరాడు. దీంతో రాజేశ్వరరావు రూ.80 వేల విలువ చేసే రూ.500 నోట్లు ఇచ్చాడు. అనంతరం తాను ఇవ్వాల్సిన నగదును ఏటీఎంలో డ్రా చేసి ఇస్తానని రాజేశ్వరరావును బైక్పై ఎక్కించుకొని కామయ్యతోపు వద్దకు తీసుకొచ్చి అక్కడ దింపాడు. నగదు డ్రా చేసి తెస్తానని, అంతదాకా ఇక్కడే వేచి ఉండమని చెప్పివెళ్లాడు. ఎన్ని గంటలైనా తిరిగిరాకపోవడం, జాడ తెలీకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి ఆదివారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా